తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ

Wait 5 sec.

తెలంగాణకు జారీ చేశారు. రాష్ట్రంలో మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు విస్తరించాయని.. దీని కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. వర్షాలతో పాటు, పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్లగొండ, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, మేడ్చల్‌ మల్కాజిగిరి, సంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఉన్నందను ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గత 24 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలంలో 2.22 సెం.మీ. వర్షపాతం నమోదైంది.సంగారెడ్డి జిల్లా పుల్కల్ (1.89 సెం.మీ.), చౌట్కూర్ (1.86 సెం.మీ.), అందోల్ (1.42 సెం.మీ.) ఖమ్మం రూరల్ (1.49 సెం.మీ.), తిరుమలాయపాలెం (1.37 సెం.మీ.), సూర్యాపేట జిల్లా మద్దిరాల (1.24 సెం.మీ.), యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ (1.04 సెం.మీ.) వర్షపాతం నమోదైంది. రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా, తెలంగాణలో ముందుగానే రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశించినప్పటికీ.. జూన్ నెలలో 28 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జులై నెలలో ఇప్పటి వరకు (జులై 13 నాటికి) 13 శాతం వర్షపాతం లోటు నమోదైందని భారత వాతావరణ శాఖ (IMD) గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని 340 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా.. 281 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాల సమయంలో సాధారణంగా ఏర్పడే అల్పపీడనాలు గత నెల నుంచి ఏర్పడకపోవడమే ఈ లోటు వర్షపాతానికి ప్రధాన కారణమని ఐఎండీ పేర్కొంది.