ఏపీలో నల్లమల 'నన్నారి షర్బత్‌' గురించి తెలుసా.. మొక్క రూ.3 మాత్రమే, ఆదాయం ఏకంగా రూ.30వేలు

Wait 5 sec.

ఎప్పుడైనా నన్నారీ షర్బత్ తాగి చూశారా.. టేస్ట్ అదిరిపోతుంది. నన్నారి షర్బత్ ఒక సాంప్రదాయ పానీయంగా ఉంది. వేడిలో చల్లగా ఉండేందుకు దీన్ని తాగుతారు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిదని చెబుతుంటారు. ఇది వేసవిలో తాగడానికి చాలా మంచిదంటారు. ఎందుకంటే ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది.. జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది అంటుంటారు. నన్నారి షర్బత్‌ను నిమ్మరసం, నీరు, చక్కెరతో కలుపుతారు. నన్నారి మొక్క వేర్లను ఎండబెట్టి.. వాటిని నీటిలో మరిగిచిన తర్వాత, నిమ్మరసం కలుపుతారు.అయితే నల్లమలలోని గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు నన్నారి షర్బత్ తయారవుతోంది. శ్రీశైలం ఐటీడీఏ అధికారులు నంద్యాల జిల్లా ఆత్మకూరులో కేంద్రం సహకారంతో రూ.25 లక్షలతో నన్నారి తయారీ ప్లాంటును ఏర్పాటు చేసి 'నల్లమల నన్నారి షర్బత్' పేరుతో సీసాలను అమ్మకానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు నన్నారి మొక్కల్ని పెంచి షర్బత్ తయారు చేస్తారు.. ఇలా గిరిజనులకు ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో నల్లమలలో నన్నారి మొక్కలు పెరగడానికి అనుకూలమైన వాతావరణం ఉంది. అందుకే ఆత్మకూరు సమీపంలోని కొత్తపల్లిలో 20 వేల మొక్కలు నాటారు. ఈ మొక్కల బాధ్యతను ఐటీడీఏ ఆధ్వర్యంలోని వన్ ధన్ వికాస్ కేంద్రం (వీడీవీకే ) చూసుకుంటుంది. ఈ మొక్కలు 30 నుంచి 45 రోజుల్లో నాటడానికి సిద్ధంగా ఉంటాయి. ఒక్కో మొక్కను రూ.3 చొప్పున అమ్ముతారు.. దీని ద్వారా వీడీవీకేకు రూ.30 వేల ఆదాయం వస్తుంది. ఈ మొక్కల్ని మరికొందరు గిరిజనులకు ఇచ్చి వేరే చోట కూడా పెంపకం చేపపడతారు. ఒక్కో మొక్క వేరుకు అర కేజీ బరువుండే నన్నారి గడ్డలు వస్తాయని చెబుతున్నారు. మార్కెట్లో కేజీ నన్నారి గడ్డల ధర రూ.500 నుంచి రూ.600 వరకు నడుస్తోంది. అలా గిరిజనులు పండించిన నన్నారి గడ్డలు తీసుకొచ్చి ఐటీడీఏ ప్లాంటుకు అమ్మితే వారికి ఆదాయం వస్తుంది.అంతేకాదు నన్నారి తయారీ ప్లాంటును గిరిజనులే నిర్వహిస్తారు. ఈ ప్లాంటులో రోజుకు వెయ్యి సీసాల షర్బత్ తయారు చేయవచ్చు. కేజీ నన్నారి గడ్డలతో 25 నన్నారి సీసాలు తయారు చేయొచ్చు అంటున్నారు. ఈ నన్నారీని ఒక్కో సీసాను (750ML.) రూ.150కు అమ్మితే రూ.50 లాభం వస్తుందని చెబుతున్నారు. ప్రయోగాత్మకంగా కొన్ని సీసాల షర్బత్‌ను సిద్ధం చేశారు.. వీటికి ఫుడ్‌ సేప్టీ అండ్‌ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) అనుమతి రాగానే అధికారికంగా నన్నారి ఉత్పత్తిని ప్రారంభిస్తాన్నారు ఐటీడీఏ అధికారులు. మొత్తం మీద గిరిజనులకు నన్నారితో ఆదాయం సమకూరనుంది. త్వరలోనే అందరికి ఈ నన్నారి ప్రొడక్స్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. కర్నూలు రైతు అద్భుతం.. , ఏ పంట సాగు చేశారో తెలుసా!నంద్యాల: .. 13 గేదెలు మృతి, రైతుల ఆవేదన