పూర్తిస్థాయి విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను చేధించే ఈ మిస్సైల్ వ్యవస్థను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసింది. బుధవారం లడఖ్‌లోని 15 వేల అడుగుల ఎత్తులో 'ఆకాశ్ ప్రైమ్' మిసైల్ వ్యవస్థను పరీక్షించారు. ఈ వ్యవస్థ నిర్దేశిత రెండు హై-స్పీడ్ డ్రోన్లను విజయవంతంగా ధ్వంసం చేసింది. తన లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించి, భారత రక్షణ సామర్థ్యాన్ని చాటిచెప్పింది. ఆకాశ్ మార్క్-1, మార్క్-1ఎస్‌ల ఆధారంగా స్వదేశీయంగా దీనిని అభివృద్ధి చేశారు. మొత్తంలో 20 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను చేధించేలా ఆకాశ్ ప్రైమ్‌ను రూపొందించారు. 4,500 మీటర్లకు పైగా ఎత్తుల్లో పనిచేయగల సామర్థ్యం దీని సొంతం. 60 కిలోల వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలిగే మిస్సైల్ వ్యవస్థ 'ఫైర్ అండ్ ఫర్‌గెట్' విధానంలో పనిచేస్తుంది. టార్గెట్‌ను చివరి దశలో ట్రాక్ చేసి ధ్వంసం చేస్తుంది. ఇందులో ఆటోమేటిక్ టార్గెట్ డిటెక్షన్, ట్రాకింగ్, న్యూట్రలైజేషన్ వ్యవస్థ ఉన్నాయి. ఆర్మీ మూడో, నాలుగో ఆకాశ్ రెజిమెంట్లలో ప్రైమ్ క్షిపణులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మెరుగైన ఖచ్చితత్వం కోసం స్వదేశీ యాక్టివ్ రేడియో ఫ్రీక్వెన్సీ (RF) సీకర్‌ను అమర్చారు. ఆపరేషన్ సిందూర్‌లో ప్రధాన పాత్రసమయంలో, పాకిస్థాన్ వైమానిక దాడులను అడ్డుకోవడంలో ఆకాశ్ మిసైల్ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. మొదటిసారి ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ ఉపయోగించబడింది. ఈ వ్యవస్థలో వివిధ లేయర్లుగా రక్షణ కవచం ఉంటుంది. లోపలి లేయర్‌లో డ్రోన్లను కూల్చే కౌంటర్ యూఏఎస్‌లు ( Counter-UAS), ఎయిర్ డిఫెన్స్ గన్స్ (L-70, Shilka), మాన్ పోర్టబుల్ మిసైల్ వ్యవస్థలు (MANPADS),మధ్య లేయర్‌లో స్పైడర్, పేచోరా వంటి షార్ట్ రేంజ్ మిసైళ్లు, మూడో లేయర్‌లో ఆకాశ్, ఇండో-ఇజ్రాయెలీ MRSAM వంటి మిడియం రేంజ్ మిసైళ్లు ఉంటాయి. అలాగే,భారత సైన్యం వెల్లడించిన వివరాల ప్రకారం.. భవిష్యత్తులో ఆకాశ్ ప్రైమ్ ఆధారంగా మూడు, నాలుగు రెజిమెంట్లుగా ఏర్పాటు చేయనున్నారు. ఇది సమర్థవంతమైన ఎయిర్ డిఫెన్స్ కోసం కీలక ఆయుధంగా మారబోతోంది. లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ.. భారత గగనతల రక్షణ వ్యవస్థ ఉదాహరణగా క్రికెట్‌ను వివరించారు. భారీ ఎత్తులోప్రతికూల వాతావరణంలోనూ ఖచ్చితత్వంతో పని చేస్తుందని తెలిపారు. ఆకాష్ ప్రైమ్‌ను తొలిసారిగా సెప్టెంబర్ 2021లో ఒడిశాలోని చాందీపూర్‌ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుంచి పరీక్షించారు.