నలుగురు అన్యమత ఉద్యోగుల్ని టీటీడీ సస్పెండ్ చేసింది. 'టీటీడీలో పనిచేస్తున్న శ్రీ బి.ఎలిజర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( క్వాలిటీ కంట్రోల్), శ్రీమతి ఎస్. రోసి, స్టాప్ నర్స్, బర్డ్ ఆసుపత్రి, శ్రీమతి ఎం.ప్రేమావతి, గ్రేడ్ -1 ఫార్మసిస్ట్ , బర్డ్ ఆసుపత్రి, అదేవిధంగా డా.జి.అసుంత. ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీ లలో విధులు నిర్వహిస్తున్న ఈ నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశాము. సదరు నలుగురు ఉద్యోగులు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారని అందుకు సంబంధించిన ఆధారాలు ,వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వారిని సస్పెండ్ చేయడం జరిగింది' అని తెలిపారు.'సదరు ఆరోపణల నేపథ్యంలో ఉద్యోగులు పనిచేస్తూ సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని భావించడమేకాక, హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తూ భాద్యతా రహితంగా వ్యవహరించడం జరిగింది. ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో సదరు నలుగురు ఉద్యోగులను తక్షణమే సస్పెండ్ చేయడం జరిగింది' అని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ' ఈవో శ్రీ జె. శ్యామలరావు గారి పేరుతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన ఫేస్‌బుక్‌లో గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ ఖాతాను సృష్టించి, భక్తులకు సందేశాలు పంపుతూ డబ్బులు కావాలని కోరుతున్నారని టీటీడీ దృష్టికి వచ్చింది. ఇది పూర్తిగా మోసగాళ్ల నకిలీ చర్యగా గుర్తించడం జరిగింది. భక్తులు ఇటువంటి నకిలీ అకౌంట్లకు దూరంగా ఉండాలని, ఎవరికైనా ఇలాంటి సందేహాస్పద సందేశాలు వస్తే వెంటనే టీటీడీ విజిలెన్స్ విభాగానికి చెందిన సెల్ నెం: 9866898630. లేదా టీటీడీ టోల్ ఫ్రీ నెం: 18004254141 కు ఫోన్ చేసి సమాచారం తెలియజేయాలని కోరడమైనది. భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org లేదా సోషల్ మీడియా అధికారిక ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని విజ్ఞప్తి చేయడమైనది' అని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల ఎవరో టీటీడీ ఈవో పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడంతో స్పందించారు.