ఆస్ట్రేలియాను చిత్తు చిత్తు చేసిన సౌతాఫ్రికా.. వన్డే సిరీస్ కైవసం!

Wait 5 sec.

టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న , వన్డే సిరీస్‌ను చేజార్చుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లలోనూ ఓటమిపాలయింది. - ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో వన్డేలో కంగారులు దారుణ పరాజయం మూటగట్టుకున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ 8, కెప్టెన్ మర్కరరమ్ 0 పరుగులతో విఫలమయ్యారు. ఫస్ట్ డౌన్‌లో వచ్చిన టోనీ డిజోరీ కూడా 38 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. దాంతో దక్షిణాఫ్రికా జట్టు 90 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్ బ్యాటర్లు బ్రీట్జ్కీ, ట్రిస్టన్ స్టబ్స్ ఇన్నింగ్స్‌ని నిలబెట్టారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 89 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. బ్రీట్జ్కీ 88 పరుగులు చేయగా, ట్రిస్టన్ స్టబ్స్ 74 పరుగులు చేసి అవుటయ్యారు. మొదటి వన్డేలో ఆరు పరుగులు చేసిన డెవాల్డ్ బ్రెవిస్ ఈ వన్డేలో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. వియాన్ ముల్డర్ 26, కేశవ్ మహారాజ్ 22 పరుగులు చేయడంతో 49.1 ఓవర్లలో 277 పరుగులకు సఫారీ జట్టు ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా ఇచ్చిన 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టులో ట్రావిస్ హెడ్ మరోసారి నిరాశ పరిచాడు. మార్నస్ లబుషేన్ కూడా ఒక్క పరుగుకే అవుటయ్యాడు. కెప్టెన్ మార్ష్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. దాంతో ఆస్ట్రేలియా 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కామెరూన్ గ్రీన్, జోష్ ఇంగ్లిష్ నాలుగో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గ్రీన్ 35 పరుగులు చేసి అవుటవ్వడంతో మిగతా బ్యాటర్లు కూడా పెవిలియన్‌కు క్యూ కట్టారు. వికెట్లు పడుతున్నా జోస్ ఇంగ్లిస్ మాత్రం బ్యాట్‌తో విరుచుకు పడ్డాడు. 74 బంతులు ఆడిన ఇంగ్లిస్ 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 87 పరుగులు చేసి అవుటయ్యాడు. టెయిలెండర్స్ అందరూ సింగిల్ డిజిట్‌కే దుకాణం సర్దేశారు. ఆస్ట్రేలియా జట్టు 37.4 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో సౌతాఫ్రికా 84 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు వికెట్లు తీసుకున్న లుంగీ ఎంగిడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మొదటి వన్డేలో 98 పరుగుల తేడాతో విజయం సాధించిన సౌతాఫ్రికా జట్టు, రెండో వన్డేలో 84 పరుగులతో గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్‌లో మొదటి రెండు వన్డేల్లో గెలిచి సఫారీ జట్టు సిరీస్ సొంతం చేసుకుంది. మొదటి వన్డేకు బవుమా కెప్టెన్‌గా వ్యవహరించగా, రెండో వన్డేకు మర్కరమ్ బాధ్యతలు తీసుకున్నాడు. ఇక నామమాత్రపు మ్యాచ్ అయిన మూడో వన్డే ఆగస్టు 24న జరగనుంది.