తెలంగాణలోని . తమ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని త్వరలో నెరవేరుస్తామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన నేతన్న పొదుపు నిధుల (త్రిఫ్ట్‌ ఫండ్) విడుదల కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఇతర అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నేతన్నల సమస్యలపై మాట్లాడారు.ప్రభుత్వం వద్ద ఉన్న నివేదిక ప్రకారం చేనేత కార్మికుల ఉందని ఈ సమస్యను పరిష్కరించడానికి త్వరలో కేబినెట్ సమావేశంలో చర్చించి నిధులు విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నేతన్నల చిరకాల కోరిక అయిన నూలు బ్యాంక్ ద్వారా ఇప్పటివరకు వంద సహకార సంఘాలకు 2,500 టన్నుల నూలును అందించినట్లు తెలిపారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా వస్త్ర పరిశ్రమకు వివిధ పథకాల కింద రూ.290 కోట్ల బకాయిలు ఉన్నాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. వీటిని పలు విడతల్లో విడుదల చేస్తూ వచ్చామని తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవల బ్యాక్ బిల్లింగ్ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ సమస్యపై కూడా త్వరలోనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.బీఆర్ఎస్ నేతలు సామాజిక మాధ్యమాల్లో తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి తుమ్మల తీవ్రంగా ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని, అనవసరమైన విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్లలోని చేనేత కార్మికుల చేతుల మీదుగా తయారైన కొత్త చీరను మంత్రి తుమ్మల ఆవిష్కరించారు. ఈ చీరలను రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చీర ధర సుమారు రూ.480 ఉంటుందని, దీని వల్ల నేతన్నలకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. త్వరలోనే అమలు చేసి ఖాతాల్లోకి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.