శ్రేయస్ అయ్యర్‌ కెప్టెన్‌.. ఆసియాకప్‌ కోసం నాన్‌ సెలెక్టెడ్‌ టీమిండియా ప్లేయింగ్ లెవెన్‌ ఇదే..!

Wait 5 sec.

ఆసియాకప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే భారత్ సహా.. దాదాపు అన్ని టీమ్స్ కూడా తమ జట్టును ప్రకటించాయి. అజిత్ అగార్కర్‌ నేతృత్వంలో టీమిండియా సెలక్షన్ కమిటీ ఇటీవల జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ కెప్టెన్‌గా మొత్తం 15 మందిని ఎంపిక చేసింది. అయితే ఇందులో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ లాంటి ప్లేయర్లకు చోటు దక్కలేదు. ఆసియాకప్ 2025 కోసం బీసీసీఐ జట్టును ప్రకటించిన తర్వాత టీమిండియా మాజీ ప్లేయర్ ఆకాశ్‌ చోప్రా ఎంపిక కాని ఆటగాళ్లతో ప్లేయింగ్ లెవెన్‌ను ప్రకటించాడు. తన జట్టుకు శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. ఓపెనర్లుగా యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లను జట్టులోకి తీసుకున్నాడు. కేఎల్ రాహుల్‌కు సైతం జట్టులో చోటు కల్పించాడు. ఈ జట్టులో గాయపడ్డ రిషభ్ పంత్, నితీశ్ కుమార్ రెడ్డి సైతం ఉన్నారు. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో ఐపీఎల్ 2025లో ఆర్సీబీ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన కృనాల్ పాండ్యాకు చోటు కల్పించాడు. వాషింగ్టన్ సుందర్‌ను సైతం జట్టులో చేర్చాడు. ప్రధాన స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్.. పేసర్లుగా ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్‌లను తన జట్టులోకి తీసుకున్నాడు. భారత జట్టుకు ఎంపిక కాని ఆటగాళ్లతో ఆకాశ్‌ చోప్రా ఆసియాకప్‌ కోసం ఎంపిక చేసిన జట్టు ఇదే..శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), యశస్వి జైశ్వాల్‌ రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, రిషభ్‌ పంత్, నితీశ్‌ కుమార్ రెడ్డి, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, రవి బిష్ణోయ్.ఆసియాకప్‌ కోసం సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన భారత జట్టు:సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్‌ (వైస్ కెప్టెన్‌), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్‌), జస్‌ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్‌, వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్‌ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్‌), హర్షిత్ రాణా, రింకూ సింగ్‌.