రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. దసరా, దీపావళికి రిజర్వేషన్ కాలేదా..? ఇదిగో స్పెషల్ ట్రైన్ వచ్చేసింది..

Wait 5 sec.

దసరా, దీపావళి పండుగల సమయాల్లో రైల్వే స్టేషన్లలో అసాధారణ రద్దీ నెలకొంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు అదనపు సదుపాయాలను అందించేందుకు ముందుకొచ్చారు. సికింద్రాబాద్‌ జంక్షన్‌పై పెరిగిన ఒత్తిడిని తగ్గించడానికి.. ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి నాంపల్లి, కాచీగూడ, చర్లపల్లి నుంచి రైళ్లను నడుపుతున్నారు. దీనివల్ల హైదరాబాదు నగరంలో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని, మరోవైపు ప్రయాణికులకు సౌకర్యం లభిస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఓ స్పెషల్ ట్రైన్ ప్రకటించారు. ఇది చర్లపల్లి – తిరుపతి (07011) ప్రత్యేక వీక్లీ రైలు సెప్టెంబర్ 5 నుంచి 26 వరకు ప్రతీ శుక్రవారం నడుస్తుందని పేర్కొన్నారు. తిరుగు ప్రయాణం తిరుపతి – చర్లపల్లి (07012) రైలు సెప్టెంబర్ 6 నుంచి 27 వరకు ప్రతీ శనివారం నడుస్తుందని అధికారులు తెలిపారు. ఈ రైళ్లు మల్కాజ్‌గిరి, కాచిగూడ, ఉమ్దానగర్‌, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, వనపర్తి రోడ్‌, గద్వాల నుంచి ఏపీలోని స్టేషన్ల మీదుగా తిరుపతి వెళ్తుంది. ఉండటంతో అక్కడ రద్దీ తీవ్రంగా పెరుగుతోంది. ప్రత్యేకంగా పండుగల కాలంలో టికెట్లు దొరకడం కష్టమవుతోంది. చర్లపల్లి నుంచి రైళ్లు నడపడం ద్వారా కొంత ఉపశమనం లభించినా, రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంలో స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాన్స్‌పోర్ట్ సదుపాయాలు తక్కువగా ఉండటం, బస్సు సౌకర్యం పరిమితంగా ఉండటం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు RTC, మెట్రో ఫీడర్ సర్వీసులు కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో అభివృద్ధి..రైల్వే మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణలో 38 రైల్వే స్టేషన్లు ఎంపికయ్యాయి. వీటిలో సికింద్రాబాద్‌, కాచిగూడ, వరంగల్, ఖమ్మం, కాజీపేట్, నిజామాబాద్ వంటి ప్రధాన స్టేషన్లతో పాటు పలు పట్టణ రైల్వే కేంద్రాలు కూడా ఉన్నాయి. వీటిలో ఆధునిక వసతులు, విస్తృత వేదికలు, వాహన పార్కింగ్, ప్రయాణికులకు డిజిటల్ డిస్‌ప్లే, లిఫ్టులు, ఎస్కలేటర్లు వంటి సౌకర్యాలు కల్పించనున్నారు.