Women's Employment Rate in India: రోజురోజుకూ దేశ ఆర్థిక వృద్ధిలో మహిళ భాగస్వామ్యం కూడా పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు కేవలం వంటింటికి మాత్రమే పరిమితిమైన స్త్రీలు ఇప్పుడు.. ఇంటి పనులతో పాటు వ్యాపారాలు, ఉద్యోగ పనులను కూడా చక్కబెడుతున్నారు. పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా గట్టిగా సంపాదిస్తున్నారు. గత ఆరు సంవత్సరాల్లోనే (Female Labour Force Participation Rate - FLFPR) దాదాపు రెట్టింపు అయిందని ఉపాధి మంత్రిత్వ శాఖ సోమవారం రోజు వెల్లడించింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో కేవలం 22 శాతంగా ఉన్న 2023-24 నాటికి 40.3 శాతానికి చేరుకుంది. ఈ అద్భుతమైన వృద్ధి దేశాభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న కీలక పాత్రకు స్పష్టమైన నిదర్శనంగా నిలుస్తోంది. పెరుగుదల గ్రామీణ ప్రాంతాల్లో మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ మహిళా ఉపాధి రేటు 24 శాతం నుంచి 44.9 శాతానికి చేరుకుంది. దీనికి కారణం వ్యవసాయ రంగం నుంచి వివిధ రకాల చిన్న పరిశ్రమలు, సర్వీస్ సెక్టార్‌లోకి మహిళలు అడుగు పెట్టడం. పట్టణ ప్రాంతాల్లో ఈ వృద్ధి కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ.. అది కూడా ఆశాజనకంగానే ఉంది. పట్టణ ప్రాంతాల్లో మహిళా కార్మిక శక్తి భాగస్వామ్యం 2017-18లో 17.5 శాతం ఉండగా.. 2023-24 నాటికి ఇది 29.5 శాతానికి చేరింది. అలాగే మహిళా గ్రాడ్యుయేట్ల ఉద్యోగ సామర్థ్యం కూడా 2013లో 42 శాతం మాత్రమే ఉండగా.. 2024లో 47.53 శాతానికి పెరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్య, అంతకంటే ఎక్కువ చదువుకున్న మహిళల్లో ఉపాధి రేటు 2017-18లో 34.5 శాతం ఉండగా.. 2023-24లో 40 శాతానికి పెరిగినట్లు తెలిపింది. ఇండియా స్కిల్స్ రిపోర్టు 2025 ప్రకారం.. 2024లో 51.2 శాతంగా ఉన్న భారతీయ గ్రాడ్యుయేట్లలో దాదాపు 55 శాతం మంది ప్రపంచవ్యాప్తంగా ఉపాధి పొందుతున్నట్లు వివరించింది. అంతేకాకుండా EPFO జీతాల డేటా అధికారిక రంగంలో . గత ఏడు సంవత్సరాల్లో 1.56 కోట్ల మంది మహిళలు అధికారిక శ్రామిక శక్తిలో చేరారు. అలాగే ఈ-శ్రమ్ ఆగస్టు నాటికి 16.69 కోట్లకు పైగా అసంఘటిత మహిళల కార్మికుల రిజిస్ట్రేషన్లు నమోదు చేసినట్లు ఉపాధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే మహిళల ఆర్థిక వృద్ధి రేటు పెరగడానికి చాలానే కారణాలు ఉన్నాయని కూడా తెలిపింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పలు పథకాలు, కార్యక్రమాలు మహిళా సాధికారతకు దోహదపడ్డట్లు పేర్కొంది. ఉదాహరణకు ముద్రా యోజన, స్టాండ్-అప్ ఇండియా వంటి పథకాల ద్వారా మహిళలు చిన్న వ్యాపారాలు ప్రారంభించేందుకు . అలాగే జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా స్వయం సహాయక బృందాలను ప్రోత్సహించడం కూడా గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఉపాధికి కొత్త ఊపిరిని ఇచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.మొత్తంగా జాతీయ స్థాయిలో.. 15 మంత్రిత్వ శాఖల్లో 70 కేంద్ర పథకాలు, 400కు పైగా రాష్ట్రస్థాయి పథకాలు మహిళా వ్యవస్థాపకతకు మద్దతు ఇవ్వడంపై దృష్టి సారించాయి. PLFS డేటా ప్రకారం మహిళా స్వయం ఉపాధి కూడా 30 శాతం పెరిగింది. 2017-18లో 51.9 శాతం నుంచి 2023-24లో 67.4 శాతానికి పెరిగింది. దీని వల్ల మహిళలు నిజంగా ఆత్మనిర్భర్‌గా మారారని స్పష్టం చేసింది. అలాగే గత 10 సంవత్సరాల్లో లింగ బడ్జెట్లు 429 శాతం పెరిగినట్లు వివరించింది. 203-14 ఆర్థిక ఏడాదిలో రూ.0.85 లక్షల కోట్ల నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.4.49 లక్షల కోట్లు పెరిగినట్లు తెలిపింది. వీటితో పాటు సమాజంలో పెరుగుతున్న విద్య, కుటుంబాల ఆలోచనా విధానంలో వస్తున్న మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం సులువుగా అందుబాటులోకి రావడం వంటివి కూడా ఈ సానుకూల ధోరణికి కారణమయ్యాయి. మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా మారడం వల్ల వారి కుటుంబాలతో పాటు దేశం కూడా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా కుటుంబాల్లో మహిళల నిర్ణయాలకు విలువ పెరిగింది. ఇది పిల్లల విద్య, ఆరోగ్యం వంటి విషయాల్లో మరింత మెరుగైన ఫలితాలను తావిస్తోంది. అలాగే మహిళలు పని చేయడం వల్ల కుటుంబ ఆదాయం పెరిగి, పేదరికం కూడా తగ్గుముఖం పడుతోంది. మొత్తంగా మహిళల చేసే ఉద్యోగాలు, వ్యాపారాల వల్ల దేశ స్థూల జాతీయోత్పత్తికి కూడా గణనీయమైన సహకారం అందుతోంది.