ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్.. వారిపై కేసులు పెట్టాలని ఆదేశం..

Wait 5 sec.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను వేధిస్తున్న ప్రధాన సమస్య . తెలంగాణకు సంబంధించి ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఇటీవలి కాలంలో వర్షాలు సమృద్ధిగా కురవటంతో యూరియాకు డిమాండ్ ఏర్పడింది. అయితే ధరలు మాత్రం పెరిగిపోయాయి. కొంతమంది వ్యాపారులు యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలించి కృత్తిమ కొరతను సృష్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం నారా నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారిని గుర్తించి.. అలాంటి వారిపై కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎరువుల లభ్యత, సరఫరా మీద చంద్రబాబు ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. డీజీపీ. వ్యవసాయ శాఖ ఆధికారులు, విజిలెన్స్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయేతర అవసరాలకు యూరియా తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఎరువుల లభ్యత, సరఫరాపై జిల్లాల వారీగా లెక్కలపై ఆరా తీశారు. అలాగే విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. యూరియాతో పాటుగా ఎరువుల స్టాక్‌ చెకింగ్‌ చేపట్టాలని సూచించారు. అలాగే ఎరువుల రేట్లు పెంచి అమ్మేవారిపై చర్యలు తీసుకోవాలని.. బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా ఎరువుల సరఫరా ఎంతమేరకు జరుగుతోందనే వివరాలను ఆరా తీసిన సీఎం.. మార్క్‌ఫెడ్‌ ద్వారానే ఎక్కువగా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రైవేటు డీలర్లకు ఎరువులు కేటాయింపు తగ్గించాలని.. యూరియా విషయంలో రాష్ట్రంలోని రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మరోవైపు డీఏపీ, యూరియా ధరలు ఈ మధ్యకాలంలో భారీగా పెరిగాయి. బస్తా యూరియాను రూ.266 వరకూ అమ్మాల్సి ఉంటుంది. అయితే ఓపెన్ మార్కెట్లో మాత్రం రూ.350 నుంచి రూ.375 వరకూ విక్రయిస్తున్నారు. ఇక డీఏపీ విషయానికి వస్తే రూ.1350లుగా ఉండాల్సిన డీఏపీ రేటు.. రూ.1550కి పైగానే ఉంది. కొన్నిచోట్ల రైతులకు యూరియా, డీఎపీ అస్సలు దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎరువుల లభ్యత, వాటి సరఫరాపై సమీక్షించారు చంద్రబాబు. ఎరువులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని.. ఎవరైనా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కేసులు పెట్టాలని అధికారులను ఆదేశించారు.