ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని కులాలను ఎస్సీ, ఎస్టీ జాబితాల్లోకి మార్చాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపింది.. వాటిని ఆమోదించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఓ రెండు కులాలను ఎస్టీల్లోకి చేర్చాలన్న ప్రతిపాదనలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. 2017లో డాక్టర్ పీడీ సత్యపాల్‌కుమార్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, వాల్మీకి, బోయలు ఏపీలో 25.80 లక్షల మంది ఉన్నారు. వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ అంశంపై టీడీపీ ఎంపీలు కేశినేని శివనాథ్, అంబికా లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి దుర్గాదాస్ ఉయికె లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. వాల్మీకి, బోయల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని ఏపీ పంపిన ప్రతిపాదనలకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI) మద్దతు ఇవ్వలేదని కేంద్రమంత్రి తెలిపారు. అయితే ఏపీలోని వాల్మీకి, బోయల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి ఈ అంశంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. వాల్మీకి, బోయల్ని ఎస్టీ జాబితాలో కలిపే దిశగా ఏపీ ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందన్నది చూడాలి. మరోవైపు నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి కూడా శబరి కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరారు. పార్లమెంటులో మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. నంద్యాల నియోజకవర్గంలో ఈ కులం వారు ఎక్కువగా ఉన్నారని.. గతంలోనే ఈ విషయాన్ని కేంద్రానికి తెలియజేశామని గుర్తు చేశారు. బేడ బుడగ జంగం కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చడంపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. తమ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినందుకు బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం ఎంపీ శబరికి ధన్యవాదాలు తెలిపింది. పీఎంకేఎస్‌వై- ఏఐబీపీ కింద జీరోకేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు నిధుల విడుదలపై స్పష్టత ఇచ్చింది. పీఎంకేఎస్‌వై- ఏఐబీపీ కింద రాష్ట్రంలోని 8 ప్రాజెక్టులకు 2019 నుంచి 2025 మధ్య ఎలాంటి నిధులు ఇవ్వలేదని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్‌ చౌధరి లోక్‌సభలో తెలిపారు. గుండ్లకమ్మ, ముసురుమిల్లి ప్రాజెక్టుల పనులు ఆలస్యం కావడం, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను సరిగా ఖర్చు చేయకపోవడమే దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు. అయితే, పోలవరం ప్రాజెక్టుకు మాత్రం రూ.20,658.71 కోట్లు విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు.విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఈ విషయాలు చెప్పారు. తోటపల్లి బ్యారేజ్, తాటిపూడి, పుష్కర ఎత్తిపోతల పథకాలు, ఎర్రకాల్వ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఎలాంటి నిధులు బకాయి లేవన్నారు. వరికపూడిసెల ప్రాజెక్టుతో పాటు ఇతర కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపలేదన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించామని, 2025 మార్చి వరకు రూ.20,658.71 కోట్లు విడుదల చేశామని మంత్రి రాజ్‌భూషణ్‌ చౌధరి లోక్‌సభలో చెప్పారు.