అభిమానుల మరణాలపై మౌనం వీడిన ఆర్సీబీ.. 84 రోజుల తర్వాత ఎమోషనల్ పోస్ట్!

Wait 5 sec.

. కేవలం ఆర్సీబీనే కాదు చరిత్రలో గుర్తుండిపోతుంది. 18 ఏళ్ల కల నెరవేరిన జ్క్షాపకాలు అంతలోనే విషాదంగా మారాయి. . బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనపై 84 రోజుల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్‌మెంట్ మౌనం వీడింది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయడంతో పాటు తమకు అండగా నిలిచిన అభిమానుల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందించారు.తొక్కిసలాట ఘటన తర్వాత సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టని శుక్రవారం ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది. జూన్ 4న చోటుచేసుకున్న సంఘటన తమ హృదయాలను చిదిమేసిందని, ఇన్నాళ్ల మౌనం తప్పించుకోవడం కాదని.. అది అంతులేని దుఃఖమంటూ ఆర్సీబీ తమ పోస్ట్‌లో పేర్కొంది. తరఫున విడుదలైన ప్రకటనలో “ఈ వేదిక ఎప్పుడూ ఉత్సాహం, జ్ఞాపకాలు, అభిమాన క్షణాలతో నిండిపోయేది. కానీ జూన్ 4వ తేదీ అన్నీ మార్చేసింది. ఆ రోజున మా హృదయాలు బద్ధలయ్యాయి. అప్పటి నుంచి ఉన్న మౌనం, మా దుఃఖాన్ని వ్యక్తపరిచే మార్గం మాత్రమే” అని పేర్కొంది.ఈ మౌనంలో తాము ఆత్మపరిశీలన, వినికిడి, నేర్చుకోవడంలో గడిపామని, క్రమంగా ఒక అర్థవంతమైన కార్యక్రమం ఆవిష్కృతమైందని ఆర్సీబీ తెలిపింది. అదే ‘’. అభిమానులపై గౌరవం, వారికి తోడుగా నిలబడాలనే అవసరం నుంచి ఈ కార్యక్రమం పుట్టుకొందని జట్టుప్రతినిధులు వెల్లడించారు.“ఇది కేవలం ఒక ప్రతిస్పందన మాత్రమే కాదు. మా అభిమానుల సంఘం, సమాజం రూపకల్పన చేసిన అర్థవంతమైన చర్యల కోసం వేదిక. మేము తిరిగి ఈ వేదికలోకి వచ్చాము. ఉత్సవంతో కాదు జాగ్రత్తతో, సహకారంతో, మద్దతుతో. అభిమానులతో కలిసి ముందుకు నడవడానికి, కర్ణాటక గర్వకారణంగా కొనసాగడానికి” అని ఆర్సీబీ తన పోస్ట్‌లో పేర్కొంది. ప్రస్తుతం ‘ఆర్సీబీ కేర్స్’ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు జట్టు తెలిపింది.