మరోసారి అభిమానులను అలరించాడు. వీధుల్లో ఆయన తన హమ్మర్ కారును డ్రైవ్ చేస్తూ కనిపించాడు. ఎక్కువగా బైక్ రైడింగ్స్, కారులో షికార్లు చేస్తూ సరదాగా రోడ్లపై కనిపిస్తూనే ఉంటాడు. సొంత ఊర్లోనే ఉంటున్న ధోనీ అప్పుడప్పుడు ఇలా బయట కనిపించి ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంటాడు. ధోనీ కారుపై టచ్ కనిపించింది. కారుపై ఫైటర్ జెట్లు, ట్యాంకులు, విమానాలు, సైనికుల ఆర్ట్‌వర్క్ చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఆర్మీలో ఉన్నత స్థాయి ర్యాంకులో ఉన్న ధోనీ.. దేశం కోసం ఎప్పుడూ ముందే ఉంటాడు. యుద్ధ సమయాల్లోనూ ధోనీ స్పందిస్తుంటాడు. ఐపీఎల్ సమయంలోనూ ఆర్మీ యూనిఫామ్‌లో ఉండే గ్లోవ్స్ వేసుకుని కీపింగ్ చేస్తూ దేశభక్తిని ప్రదర్శిస్తుంటాడు. ధోనీ హమ్మర్ కారు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇండియన్ ఆర్మీ టచ్‌లో ఉన్న ఈ కారు ట్రెండింగ్ అయింది. ఈ మోడిఫికేషన్ రాంచీలోని ఒక కారు డీటైలింగ్ స్టూడియోలో 2024లో పూర్తయినట్లు తెలుస్తోంది. స్టూడియో ఫౌండర్ అచ్యుత్ కుమార్ ఈ విషయాన్ని నేరుగా నేషనల్ మీడియాతో పంచుకున్నాడు. ధోనీనే తన కారు ఆర్మీ థీమ్‌లో కావాలని కోరినట్లు అచ్యుత్ వెల్లడించారు. ప్రస్తుత మార్కెట్‌లో ధోనీ వాడుతున్న హమ్మర్ కారు ధర సుమారు రూ.75 లక్షల వరకు ఉంటుంది. ఈ మాడిఫికేషన్లు, మిగతా సామగ్రి ఇవన్నీ కలుపుకుంటే మరో రూ. 5 లక్షలు అంటే మొత్తం రూ.80 లక్షలు అనమాట! ధోనీకి కార్లు, బైక్‌లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ కొత్త మోడల్ వచ్చినా ధోనీ దగ్గర ఉండాల్సిందే!క్రికెట్ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు 2019 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ పలికారు. అప్పటి నుంచి కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు.. అది కూడా అభిమానుల కోసమే. తరఫున ఆడుతున్న ధోనీ ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. రుతురాజ్ గైక్వాడ్‌కి గాయం కావడంతో గత సీజన్‌లో ఎంఎస్ ధోనీ సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. మరి ఐపీఎల్ 2026 సీజన్ మొత్తం ఆడతాడా? లేక మధ్యలోనే రిటైర్మెంట్ ఇస్తాడా? అనేది ఇప్పటివరకు ఎవ్వరికీ స్పష్టత లేదు. మ్యాచ్‌లో ఆడినా, ఆడకపోయినా ఎప్పుడూ చెన్నై సూపర్ కింగ్స్‌లోనే కొనసాగుతానని మాత్రం ఆయన స్పష్టం చేశాడు.