ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉండి, తాత్కాలిక వైకల్యంగా సదరం సర్టిఫికెట్లలో నమోదైన వారికి పింఛన్లు కొనసాగించాలని నిర్ణయించింది. వైద్య ఆరోగ్య శాఖ తనిఖీల్లో కొందరికి ఇలా జరిగింది. అర్హులైన వారికి నోటీసులు వెనక్కి తీసుకుని, పింఛన్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ నిర్ణయం వైకల్యం ఎక్కువగా ఉండి, సదరం సర్టిఫికెట్లలో తాత్కాలిక వైకల్యంగా నమోదైన వారికి ఇది ఊరటనిచ్చే విషయం. కొనసాగుతుందరి గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌) ఈ మేరకు జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగ, హెల్త్ కోటాల పింఛన్లు తీసుకుంటున్నవారిలో అనర్హులు ఉన్నారనే ఫిర్యాదులతో తనిఖీలు చేపట్టింది. వీరిలో అనర్హుల్ని గుర్తించి వారికి పింఛన్ రద్దు చేస్తామని కొద్దిరోజులుగా నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే వారు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. పింఛన్ రద్దు లేదా పింఛన్ కేటగిరి మార్పుతో నోటీసు పొందిన వారు ఏదైనా అప్పీల్ చేసుకోవాలి అనుకుంటే ఎంపీడీవో ఆఫీస్‌లో అవసరమైన డాక్యుమెంట్లు అందించాల్సి ఉంటుంది. అప్పీల్ కోరుతూ అర్జీ (ఎంపీడీవోకు రాయాలి), ఆధార్ కార్డ్ జెరాక్స్, పింఛన్ రద్దు /పింఛన్ మార్పు నోటీసు, సదరం సర్టిఫికేటు (పాతది), సదరం సర్టిఫికేట్ (కొత్తది).. అలాగే పింఛన్ లబ్ధిదారుడికి సంబంధించిన ఏదైనా ఒక ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న/తీసకుంటున్న డాక్యుమెంట్స్ అవి సమర్పించాలి ఇలా అప్పీల్ చేసుకున్న వారికి ఎంపీడీవో లాగిన్ నుంచి మరోసారి Reassement కు నోటీసు జారీ చేస్తారు. పింఛను దారులు మరొకసారి Reasssement కొరకు హాజరు కావాల్సి ఉంటుంది. అప్పీల్ కొరకు జిల్లా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఎంపీడీవో ద్వారా Reassesmentకు వెళ్ళమని నోటీసు ఇచ్చిన తర్వాత మాత్రమే నిర్దేశించిన ఆస్పత్రికి వెళ్లా్ల్సి ఉంటుంది. వికలాంగుల పింఛను పొందుతూ Reassement తర్వాత కొంతమందికి 60 సంవత్సరాలు ఉన్న కారణంగా వృద్ధాప్య పింఛనుగా మారాయి. అయితే ఇదే తరహాలో వికలాంగుల పింఛన్ పొందుతూ Ineligible నోటీసు వచ్చిన వారిలో కొంతమందికి భర్త చనిపోయి వితంతువు పింఛను పొందేందుకు అవకాశం ఉంది. కావున ఇలాంటి వారికి వితంతువు పింఛన్ మార్పు చేసేందుకు ఎంపీడీవో లాగిన్‌లో ఆప్షన్ కల్పించాల్సిందిగా పలువురు పింఛనుదారులు కోరుతున్నారు. కాబట్టి పింఛన్‌లకు సంబంధించి అప్పీల్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తామని.. అదే సమయంలో పింఛన్‌లు తీసుకుంటున్న అనర్హులపై వేటు తప్పదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. పింఛన్ల విషయంలో ఎవరికి ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు.