వీధి వ్యాపారులకు కేంద్రం శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.50 వేలు.. పీఎం స్వనిధి స్కీమ్ పొడిగింపు

Wait 5 sec.

PM SVANidhi: వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఇందుకోసం ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి (పీఎం స్వనిధి) పథకాన్ని అందిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు గరిష్ఠంగా రూ.30 వేల వరకు లోన్ అందించారు. పీఎం స్వనిధి పథకాన్ని మార్చి 31, 2030 వరకు పొడిగించారు. అలాగే ఈ స్కీమ్ ద్వారా అందిస్తున్న లోన్ పరిమితిని సైతం పెంచారు. మరి ఈ స్కీమ్ గురించి వివరాలు తెలుసుకుందాం. ద్వారా 1.15 కోట్ల మందికి ప్రయోజనం అందించాలని కేంద్రంగా లక్ష్యంగా పెట్టుకుంది. అందులో 50 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు లోన్ అందించనున్నారు. ఇప్పటి వరకు మొత్తం రూ.7332 కోట్ల మందికి లోన్ మంజూరు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది. ఈ స్కీమ్ ద్వారా మూడు విడుతల్లో లోన్ ఇస్తారు. తొలి, రెండో విడతల్లో తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లించిన వారికి యూపీఐ ఆధారిత రూపే క్రెడిట్ కార్డు (UPI Linked Rupay Credit Card) అందిస్తారు. అలాగే రిటైల్, వోల్‌సేల్ ట్రాన్సాక్షన్లపై డిజిటల్ క్యాష్ బ్యాక్ సైతం ఇస్తారు. ఇక రెండో విడుతలో ఇప్పటి వరకు రూ.20 వేల వరకు లోన్ ఇస్తుండగా దానిని రూ.25 వేలకు పెంచారు. ఈ రెండు విడతల రుణాలను సరైన కాలంలో తిరిగి చెల్లిస్తే మూడో విడతలో రూ.30 వేలు లోన్ ఇచ్చే వారు. ఇప్పుడు దీనిని రూ.50 వేలకు పెంచారు. మూడో విడత లోన్ తీసుకునే సమయంలోనే యూపీఐ లింక్డ్ రూపే క్రెడిట్ కార్డు పొందేందుకు అర్హత లభిస్తుంది. అత్యవసర వ్యాపార అవసరాలు, పర్సనల్ అవసరాలు పూర్తి చేసుకునేందుకు ఈ క్రెడిట్ కార్డును ఉపయోగించుకోవచ్చు. ఈ పథకాన్ని కేంద్ర హౌసింగ్ అర్బన్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డీఎఫ్ఎస్ కలిసి నిర్వహిస్తున్నాయి. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల ద్వారా లోన్లు, క్రెడిట్ కార్డులను అందిస్తారు. ఈ స్కీమ్ ద్వారా స్ట్రీట్ వెండర్స్‌కి రూ.1600 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. వీధి వ్యాపారులకు పెట్టుబడి సాయం అందించడం ద్వారా వ్యాపార సామర్థ్యాన్ని పెంచడం, ఆర్థిక అక్షరాస్యతను పెంచడం, డిజిటల్ స్కిల్స్ అందించడం మార్కెటింగ్ వంటి అంశాల్లో నైపుణ్యాలు అందిపుచ్చుకునేలా చేయడమే లక్ష్యం. ఈ పథకాన్ని 2020, జూన్ 1వ తేదీన ప్రారంభించారు. ఇప్పుడు మరోసారి పొడిగిస్తూ 2030, మార్చి 31 వరకు అవకాశం కల్పించారు. అర్హులైన వారు నేరుగా ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.