అనిల్ అంబానీ 'రిలయన్స్' స్టాక్‌కు ఏమైంది.. గరిష్ఠాల నుంచి 67 శాతం డౌన్.. ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు!

Wait 5 sec.

Ambani Stocks: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే వారికి రిస్క్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎన్నో అంశాలు స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తుంటాయి కనుక స్టాక్ ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇటీవలి కాలంలో ఇంకా అంతర్జాతీయంగా అనిశ్చితి, ప్రతికూల సంకేతాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఇవాళ కూడా (ఫిబ్రవరి 24) భారత స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అవుతుండగా.. రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ షేరు ఆల్ టైమ్ కనిష్ఠాలకు పడిపోయింది. కిందటి రోజు ఈ స్టాక్ ధర రూ. 25.90 వద్ద ముగియగా ఇవాళ ఫిబ్రవరి 24న దాదాపు 2 శాతం పతనంతో ఇంట్రాడేలో రూ. 25.27 వద్ద 52 వారాల కనిష్ఠ స్థాయిల్ని నమోదు చేసింది. ప్రస్తుతం వార్త రాసే సమయంలో (ఉదయం 11 గంటలకు) కూడా ఈ స్టాక్ ఒక శాతానికిపైగా పతనంతో రూ. 25.48 స్థాయిలోనే ఉంది. >> రిలయన్స్ పవర్ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 76.49 గా ఉండగా.. అక్కడి నుంచి చూస్తే ప్రస్తుత ధర సుమారు 67 శాతం దూరంలో ఉంది. అంటే గరిష్ఠ స్థాయిల నుంచి ఏకంగా షేరు ధర 67 శాతం కుప్పకూలిందన్నమాట. దీంతో ఇన్వెస్టర్లు నిండా మునుగుతున్నారు. కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 10.56 వేల కోట్లుగా ఉంది. అనిల్ అంబానీని వరుస సమస్యలు చుట్టుముడుతుండటంతో స్టాక్ ధర పడిపోతోంది. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింటోంది. దీంతో తీవ్ర అమ్మకాల ఒత్తిడితో స్టాక్ కుదేలవుతోంది. మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే అనిల్ అంబానీ కంపెనీల్లో ఈడీ సోదాలు నిర్వహించి.. అంబానీ సహా ఆయన కంపెనీల ఆస్తుల్ని చాలా వరకు జప్తు చేసుకుంది. ఇంకా అనిల్ అంబానీ దంపతులు, వారి కుమారుడికి కూడా ఈడీ గతంలో సమన్లు జారీ చేసి విచారించింది. విచారణ ఇంకా జరుగుతూనే ఉంది. బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణం తీసుకొని రిలయన్స్ గ్రూప్ కంపెనీలు.. ఇతర షెల్ కంపెనీలకు అంటే ఇతర అవసరాలకు అక్రమంగా మళ్లించారని ఆరోపణలతో కేసు నమోదైంది. >> ఇంకా 2008 మే నాటి స్టాక్ ధరతో పోలిస్తే ఏకంగా 90 శాతం పడిపోవడం గమనార్హం. 2008 మే 23న రూ. 274.81 వద్ద ఉండేది. గత 5 రోజుల్లో కూడా ఈ స్టాక్ 8 శాతం పడిపోగా.. 6 నెలల్లో 45 శాతం పతనమైంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 27 శాతం, ఏడాది వ్యవధిలో 31 శాతం కుదేలైంది. ఐదేళ్లలో మాత్రం 500 శాతం వరకు షేర్ ధర పెరిగింది.