ఆఖర్లో చెలరేగిన జింబాబ్వే, ఏకంగా 6 సిక్సర్లు.. పదో వికెట్‌కు రికార్డ్ బ్రేక్ భాగస్వామ్యం!

Wait 5 sec.

సృష్టించింది. పసికూన జింబాబ్వేపై రెచ్చిపోయిన విండీస్ బ్యాటర్లు ఏకంగా 20 ఓవర్లలో 254 పరుగులు నమోదు చేశారు. అయితే, జింబాబ్వే ఓటమి ఖాయం అయిందని తెలిసినా ఆఖరి వికెట్ వరకూ పోరాడిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. నెట్ రన్‌రేట్ ఎంత ముఖ్యమో తెలుసుకున్న జింబాబ్వే అది తగ్గించుకోవడానికి చివరి వికెట్ వరకూ పోరాటం కొనసాగించింది. 255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు తొలి రెండు ఓవర్లలో ఓవర్‌కి పది రన్‌రేట్ వచ్చేలా చూసుకుంది. ఆ తర్వాత విండీస్ స్పిన్ మాయాజాలానికి జింబాబ్వే బ్యాటర్లు బోల్తా కొట్టారు. కెప్టెన్ సికందర్ రజా పోరాడుతున్నాడు అనుకున్న సమయంలో మోటీ క్లీన్ బౌల్డ్ చేయడంతో జింబాబ్వే ఛాప్టర్ క్లోజ్ అయింది. రజా అవుటైన తర్వాత జింబాబ్వే బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దాంతో 14.3 ఓవర్లకే 103 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. ఇక అదే ఓవర్‌లో ఆలౌట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ పదో వికెట్ మీద జింబాబ్వే ప్లేయర్లు విధ్వంసం సృష్టించారు. స్పిన్, పేస్ అన్న తేడా లేకుండా దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీ బయటకు పంపించారు. జింబాబ్వే ఆల్‌రౌండర్ నగారవాతో కలిసి 18వ ఓవర్ వరకు క్రీజులో కొనసాగాడు. ఈ ఇద్దరూ కేవలం 19 బంతుల్లోనే 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో పదో వికెట్‌కి ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఎవాన్స్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 43 పరుగులు బాదాడు. నగారవా ఆరంభంలోనే సిక్సర్ బాదడంతో.. ఆ తర్వాత ఎవాన్స్ ఐదు సిక్సర్లు నమోదు చేశాడు. దాంతో ఈ ఇద్దరూ ఆరు సిక్సర్లు, ఒక ఫోర్‌తో వాంఖడేలో ప్రేక్షకులను అలరించారు. జింబాబ్వే జట్టు 147 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో వెస్టిండీస్ 107 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ వాంఖడే వేదికగా జరిగిన ఆఖరి ఐదు మ్యాచ్‌లలో వెస్టిండీస్ వరుసగా విజయాలు సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో మొత్తం 31 సిక్సర్లు నమోదయ్యాయి. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో సెకండ్ హైయెస్ట్ మార్జిన్ విక్టరీగా ఈ మ్యాచ్ నిలిచింది.