Bank Fraud: కంచే చేను మేసిన చందంగా నమ్మకంగా ఉండాల్సిన బ్యాంక్ ఉద్యోగులే భారీ దోపిడికీ తెరలేపారు. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులో హరియాణా ప్రభుత్వ నిధులకు ఎసరు పెట్టారు. ఏకంగా రూ.590 కోట్ల మేర స్వాహా చేసి సంచలనం సృష్టించారు. అకౌంట్ క్లోజ్ చేసే సమయంలో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. హరియాణా ప్రభుత్వానికి చెందిన అకౌంట్లలో తమ ఉద్యోగులు, ఆదివారం రోజు వెల్లడించింది. ఈ విషయంపై బ్యాంకింగ్ రెగ్యులేటరీ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)తో పాటుగా పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు సమాచారం అందించింది. చండీగఢ్‌లోని ఒక బ్రాంచీలో కొంత మంది బ్యాంక్ ఉద్యోగులు హరియాణా రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లలో ప్రాథమికంగా అనధికారిక, మోసపూర్తి లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించామని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ తెలిపింది. ఇతర బయటి వ్యక్తులు, సంస్థలు, కౌంటర్ పార్టీల ప్రమేయం సైతం ఇందులో ఉండే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం ఈ స్కామ్ విలువ రూ.590 కోట్లుగా అంచనా వేసినట్లు తెలిపింది. తదుపరి సమాచారం, క్లెయిమ్‌లో ధ్రువీకరణ, రివకరీల ఆధారంగా ఈ మోసం విలువ తుది మొత్తాన్ని నిర్ణయిస్తామని వివరించింది. నిర్వహిస్తున్నట్లు తెలిపింది. రుణ దాతకు వెల్లడించని తేదీన క్లోజర్, బ్యాలెన్స్ బదిలీ చేయాలని కోరుతూ మరో బ్యాంకుకు అభ్యర్థన అందినట్లు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ తెలిపింది. ఈ ప్రక్రియలో అకౌంట్లోని బ్యాలెన్స్‌తో పోలిస్తే, పేర్కొన్న మొత్తంలో వ్యత్యాసం కనిపించడాన్ని గుర్తించామని తెలిపింది. అలాగే ఈ నెల అంటే ఫిబ్రవరి 18వ తేదీ నుంచి హరియాణా ప్రభుత్వ సంస్థల ఇతర ఖాతాల్లో కూడా ఇలాంటి సమస్యలు గమనించినట్లు వివరించింది. కొందరు ఉద్యోగులు ఈ మోసానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నామని పేర్కొంది. అయితే, వారితో పాటు ఇతర వ్యక్తుల ప్రమేయం ఉండవచ్చని తెలిపింది. ఓ ప్రభుత్వ విభాగం తన అకౌంట్ క్లోజ్ చేసి నిధులను మరో బ్యాంకుకు మార్చాలని కోరిన సమయంలో అసలు బ్యాలెన్స్‌కు, రికార్డుల్లో ఉన్న బ్యాలెన్స్ మధ్య భారీ తేడా ఉండడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆర్‌బీఐతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసిన బ్యాంక్ నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు సమాచారం. అలాగే హరియాణా ప్రభుత్వం ఈ బ్యాంకును తన ఎంపానెల్‌మెంట్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై పూర్తి స్పష్టత లేదు.