Toyota Recall: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్ మోటార్ కీలక ప్రకటన చేసింది. భారత్‌లో వందల కార్లను రీకాల్ చేసింది. తమ కంపెనీకి చెందిన ప్రముఖ లగ్జరీ ఎస్‌యూవీ కారు టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 (Toyota Land Cruiser 300) కార్లలో సమస్య తలెత్తినట్లు గుర్తించి రికాల్ చేసినట్లు తెలిపింది. ల్యాండ్ క్యూయిజర్ 300 సంబంధించిన 2024, సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 2025 సెప్టెంబర్ 30వ తేదీ మధ్య తయారైన ఆయా కార్లు ఈ రికాల్ పరిధిలోకి వస్తాయని కంపెనీ తెలిపింది. మరి ఈ మీరు ఈ లిస్టులో ఉందేమో చెక్ చేసుకుని వెంటనే సమస్యను పరిష్కరించుకోవడం మంచిది. సమస్య ఏంటి?టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం గేర్ ట్రాన్స్‌మిషన్ పని తీరును నియంత్రించే ట్రాన్స్‌మిషన్ కంట్రోల్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో సమస్య తలెత్తినట్లు గుర్తించామని తెలిపింది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో గేర్ మార్పులను నిర్వహించేందుకు లీనియర్ సోలెనాయిడ్లు ఉంటాయి. కొన్ని నిర్దిష్ట డ్రైవింగ్ పరిస్థితుల్లో ఈ సోలెనాయిడ్లు సరిగ్గా పని చేయకపోతే సమస్య తలెత్తి ట్రాన్స్‌మిషన్ కంట్రోల్ యూనిట్, ఇంజిన్ ఈసీయూ మధ్య కమ్యూనికేషన్ లోపం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించి లోపాన్ని సరిచేయకపోతే కొన్ని సార్లు గేర్ ట్రాన్స్‌మిషన్ ఓవర్ రివింగ్‌కు దారి తీసే ప్రమాదం ఉందని టయోటా కిర్లోస్కర్ మోటార్ తెలిపింది. దీర్ఘకాలంలో ఇది ట్రాన్స్‌మిషన్ సిస్టంకి నష్టం కలిగిచడంతో పాటు అధిక వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు పవర్ లాస్ సమస్యను కలిగించవచ్చని తెలిపింది. ట్రాన్స్‌మిషన్ హౌసింగ్ దెబ్బ తిన్నట్లయితే ఆయిల్ లీకేజ్ జరుగుతుందని, చివరకు ట్రాన్స్‌మిషన్ వైఫల్యానికి దారి తీయవచ్చని తెలిపింది. అయితే, భారత్‌లో ఇప్పటి వరకు అయితే ఇలాంటి సంఘటనలు ఏవీ నమోదు కాలేదని, ముందస్తు జాగ్రత్తగా లోపాలను సరి చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ మోడల్ కార్లలోనూ సమస్య తలెత్తవచ్చని, పరిష్కారం కోసం ఆ కార్లను సైతం రీకాల్ చేసినట్లు కంపెనీ తెలిపింది. రీకాల్‌లో భాగమైన అన్ని కార్ల యజమానులను టయోటా డీలర్ ప్రతినిధులు వ్యక్తిగతంగా సంప్రదిస్తారు. అవసరమైన సాఫ్ట్‌వేర్ అప్డేట్ లేదా ఇతర చర్యలను ఉచితంగా అందిస్తామని కంపెనీ తెలిపింది. కస్టమర్లకు తమకు ఏవైనా సందేహాలు ఉంటే సమీప డీలర్ లేదా కస్టమర్ అసిస్టెన్స్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించింది.