ఇదెక్కడి గేమ్ ప్లాన్ గంభీరూ.. అసలు అక్షర్‌ని ఎవడైనా పక్కనబెడతాడా!

Wait 5 sec.

. ఎవ్వరూ ఊహించని విధంగా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ఒక్కసారిగా కూలిపోయింది. బౌలింగ్‌లో కూడా మిడిల్ ఓవర్లలో పరుగులు ఆపలేక భారీ స్కోర్ సమర్పించుకున్నారు. అయితే, ఈ మొత్తం సినారియోలో టీమిండియా ప్లేయింగ్ 11 సెలక్షన్‌ విషయంలో గంభీర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా అక్షర్ పటేల్‌ని పక్కనబెట్టి వాషింగ్టన్ సుందర్‌ని ఎంపిక చేయడంపై గంభీర్‌పై అందరూ గరంగరం అయ్యారు. బౌలింగ్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అక్షర్ పటేల్‌ని సౌతాఫ్రికాతో మ్యాచ్‌కి టీమిండియా డ్రాప్ చేసింది. వైస్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ పక్కనబెట్టి టీమ్‌తో లేటుగా జాయిన్ అయిన సుందర్‌ని గంభీర్ ఆడించాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన సుందర్ వికెట్లేమీ తీయకుండా 17 పరుగులు ఇచ్చాడు. అదేవిధంగా బ్యాటింగ్‌లో 11 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 187/7 పరుగులు చేయగా.. భారత జట్టు కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయింది.ఇక్కడ సుందర్‌ని జట్టులోకి తీసుకోవడం సమస్య కాదు.. అక్షర్ పటేల్‌‌ని పక్కనబెట్టడమే ప్రధాన సమస్య. టీ20ల్లో టీమిండియా కష్టకాలంలో ఉన్న ఎన్నోసార్లు అక్షర్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చి అద్భుతమైన భాగస్వామ్యం అందించిన రోజులున్నాయి. ముఖ్యంగా టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్‌లో ఆడిన తీరు అందరికీ గుర్తుంది. టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్‌లో సౌతాఫ్రికాపై అక్షర్ పటేల్ 47 పరుగులు చేశాడు. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ విఫలమైన సమయంలో కోహ్లితో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. అంతే కాకుండా క్వింటన్ డికాక్, ట్రిస్టన్ స్టబ్స్ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరి అలాంటి అక్షర్‌ని ఎందుకు పక్కనబెట్టాల్సి వచ్చిందో అర్థం కాలేదు. సూపర్ 8లో ఓటమితో మొదలుపెట్టిన టీమిండియా సెమీఫైనల్ అవకాశాలను చాలా క్లిష్టం చేసుకుంది. రన్ రేట్ కూడా -3.8కి పడిపోయింది. ఇక సెమీస్ బరిలో నిలవాలంటే జింబాబ్వే, వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లలో ఘన విజయాలు సాధించాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చిన జింబాబ్వే.. ఈ టీ20 వరల్డ్‌కప్‌లో ఓటమి ఎరుగకుండా సూపర్ 8లో అడుగుపెట్టింది. విండీస్ కూడా ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉంది. మరి భారత్ సెమీస్‌కు చేరుతుందా? లేక సూపర్ 8లోనే నిష్క్రమిస్తుందా? అనేది వేచి చూడాలి!