తిరుమలలో భక్తులు దర్శనానికి వెళ్లే క్యూలైన్‌లో పాము కలకలం రేపింది. రూ.300 క్యూలైన్‌లో పాము దూరింది.. మౌనిక అనే తెలంగాణకు చెందిన భక్తురాలిని పాము కాటేసింది. వెంటనే టీటీడీ సిబ్బంది అలర్ట్ అయ్యారు.. బాధితురాలిని క్యూ లైన్ దగ్గర నుంచి తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ప్రస్తుతం మౌనిక ఆరోగ్యం నిలకడగా ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. మౌనికది స్వస్థలం భూపాలపల్లి కాగా.. పూర్తి వివరాలు తెలియాల్సింది. అయితే భక్తుల వెళ్లే క్యూలైన్‌లోకి పాము వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. శ్రీ అనంతాళ్వార్ 972వ అవతార మహోత్సవాలుశ్రీవైష్ణవ భక్తాగ్రేసరుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతాళ్వార్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని టీటీడీ జేఈవో డాక్టర్ ఏ శరత్ తెలియజేశారు. లోని అనంతాళ్వార్ తోట (పురశైవారితోట) లో శ్రీ అనంతాళ్వార్ 972వ అవతార మహోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేఈవో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతాళ్వార్ అవతార మహోత్సవాల్లో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతం అని తెలిపారు. భక్తి అంటే ప్రార్థన మాత్రమే కాదని, భక్తి అంటే సేవ అని నిరూపించిన మహానుభావుడు అనంతాళ్వార్ అని కీర్తించారు. 972 సంవత్సరాలుగా అనంతాళ్వార్ వంశీకులు శ్రీవారికి పుష్ప కైంకర్యం చేస్తున్నారని, వారి పరంపర ఎల్లప్పటికీ కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అనంతాళ్వార్ వంశీకులు ”నాలాయిర దివ్య ప్రబంధ గోష్ఠిగానం” నిర్వహించారు. అనంతరం తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు.ఈ సందర్భంగా వేంకటాచల ఇతిహాసమాల, రామానుజులవారి తిరుమల యాత్ర, స్వామి పుష్కరిణి వైభవం, శ్రీ రామాయణ కాలక్షేపం, తిరుమలనంబి – తన్నీరముదు ఉత్సవం, మూలవర్ల తిరుమంజనం – తిరునామం, తిరుమలలో రామానుజ సన్నిధి ప్రతిష్ట, సహస్రనామార్చన వైభవం, తిరుమలలో జీయర్ మఠం స్థాపన, శ్రీవారి సుప్రభాతం-ఏకాంత సేవ, తిరుమలలో దివ్యప్రబంధ క్రమం, తిరుమలలో పుణ్య తీర్థాలు తదితర అంశాలపై వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన పండితులు ఉపన్యసించారు. ఈ కార్య‌క్ర‌మంలో అనంతాళ్వార్ వంశస్తులు వేంక‌ట కృష్ణ స్వామి, భ‌ర‌ద్వాజ‌స్వామి, త‌దిత‌రులు పాల్గొన్నారు.టీటీడీ అగరబత్తుల తయారీ కేంద్రం జేఈవో పరిశీలనతిరుపతిలోని ఎస్వీ గోసంరక్షణశాలలో ఏర్పాటు చేసిన టీటీడీ అగరబత్తుల తయారీ కేంద్రాన్ని టీటీడీ జేఈవో (విద్యా, ఆరోగ్యం) డాక్టర్ ఏ శరత్ పరిశీలించారు. ఈ సందర్భంగా తయారీ ప్రక్రియ, నాణ్యత ప్రమాణాలు, ముడిసరుకు వినియోగం, ప్యాకేజింగ్ విధానం తదితర అంశాలను పరిశీలించారు. కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో ఆరు రకాల అగరబత్తులు తయారు చేస్తున్నట్లు తెలిపారు. వీటిలో చామంతి, గులాబీ, తామర పూల సుగంధాలతో అగరబత్తులు తయారు చేస్తున్నారని వివరించారు.అదనంగా సంపంగి, వెయ్యి వరహాలు, తులసి సుగంధాలతో మరో మూడు కొత్త రకాల అగరబత్తులను త్వరలో తయారు చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. భక్తుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగించే ఉత్పత్తులను అందించడమే టీటీడీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అగరబత్తుల తయారీ కార్యక్రమం ద్వారా గోసంరక్షణశాలలో లభించే వనరులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు భక్తులకు శ్రేష్ఠమైన ధూప ఉత్పత్తులను అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎస్వీ గోశాలను పరిశీలించారు. గోవులు, పేరు దూడలు, ఏనుగులు ఇతర పశువులు ఉన్న షెడ్లలో సమయానికి దానా, తాగునీరు, వైద్య సదుపాయం, పరిశుభ్రత, ఎస్వీ గోశాల నుండి పాలను తరలించే సమయాన్ని తెలియజేసేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు.