IND vs SA: టీమిండియా చెత్త బ్యాటింగ్, 111 ఆలౌట్.. సౌతాఫ్రికాపై చిత్తుచిత్తుగా ఓటమి! భారత్ ఖేల్ ఖతం

Wait 5 sec.

గ్రూప్ స్టేజ్‌లో వరుస విజయాలతో దూసుకొచ్చిన భారత్ సూపర్ 8లో దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై ఘోర ఓటమిపాలయింది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో ఖరారయింది. కేవలం 111 పరుగులకే ఆలౌట్ కావడంతో సౌతాఫ్రికా 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. కీలకమైన సూపర్ 8 మ్యాచ్‌లో టీమిండియా చేతులెత్తేయడంతో సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ను భారత్ ఓటమితో ప్రారంభించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. డేవిడ్ మిల్లర్, డివాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్ బౌండరీల వర్షం కురిపించడంతో 20 ఓవర్లలో 187/7 పరుగులు చేసింది. భారీ టార్గెట్‌ ఛేజింగ్‌తో బరిలోకి దిగిన భారత్ తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. ప్రతిసారీ అభిషేక్ డకౌట్ అవుతుండగా.. ఈ సారి స్ట్రయికింగ్‌కి వెళ్లిన ఇషాన్ కిషన్ డకౌట్ అయ్యాడు. ఎయిడెన్ మార్కరమ్ బౌలింగ్‌లో ఇషాన్ వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే తిలక్ వర్మ (1) కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఫామ్‌లోకి వచ్చాడనుకున్న అభిషేక్ (15) కూడా ఐదో ఓవర్‌లోనే పెవిలియన్ బాట పట్టాడు. పవర్ ప్లేలో టీమిండియా టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోయింది. 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్ ఆ తర్వాత కూడా పెద్దగా రాణించలేకపోయింది. వాషింగ్టన్ సుందర్ 11 బంతుల్లో 11, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 22 బంతుల్లో 18 పరుగులు చేసి అవుటయ్యారు. దాంతో భారత్ 9.1 ఓవర్లలో 51 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది.51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత హార్దిక్ పాండ్యా - శివమ్ దూబే మ్యాచ్‌ని కొద్దిసేపు నిలబెట్టారు. ఓటమి ఖరారు అని తెలిసినా రన రేట్‌ను కాపాడుకునే ప్రయత్నం చేశారు. 14వ ఓవర్ తర్వాత భారత్ అటాక్ చేయడం మొదలుపెట్టడం.. మళ్లీ వికెట్లు వరుసగా పడటం మొదలయ్యాయి. హార్దిక్ 17 బంతుల్లో 18 పరుగులు చేసి అవుటవ్వగా.. ఆ తర్వాత బంతికే రింకూ సింగ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అదే ఓవర్‌లో అర్ష్‌దీప్ కూడా వికెట్ కోల్పోయాడు. కేశవ్ మహారాజ్ వేసిన 15వ ఓవర్‌లో భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. 88 పరుగులకే 8 వికెట్లు కోల్పోవడంతో భారత్ వంద పరుగుల లోపే ఆలౌట్ అవుతుందని అనుకున్నారు. కానీ.. శివమ్ దూబే రాణించడంతో వంద పరుగుల మార్క్‌ను భారత్ దాటేసింది. టీమిండియా బ్యాటర్లలో అందరూ విఫలమయినా శివమ్ దూబే మాత్రం 37 బంతుల్లో 42 పరుగులు చేసి ఆఖరి వరకూ పోరాడాడు. కానీ భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో సౌతాఫ్రికా 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత జట్టు స్కోర్ వివరాలు పరిశీలిస్తే ఇషాన్ కిషన్ 0 (4), అభిషేక్ శర్మ 15 (12), తిలక్ వర్మ 1 (2), సూర్యకుమార్ యాదవ్ 18 (22), వాషింగ్టన్ సుందర్ 18 (22), శివమ్ దూబే 42 (37), హార్దిక్ పాండ్యా 18 (17), రింకూ సింగ్ 0 (2), అర్ష్‌దీప్ సింగ్ 1 (2), వరుణ్ చక్రవర్తి 0 (3) నాటౌట్, బుమ్రా 0 (1). సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సన్ నాలుగు వికెట్లు పడగొట్టగా, కేశవ్ మహారాజ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. కార్బిన్ బాష్ రెండు, ఎయిడెన్ మార్కరమ్ ఒక వికెట్ దక్కించుకున్నారు.