డ్రోన్లతో ఉక్రెయిన్ భీకర దాడులు.. ఎయిర్‌పోర్ట్‌లు మూసివేసిన రష్యా

Wait 5 sec.

ఉక్రెయిన్, రష్యాల మధ్య జరుగుతోన్న యుద్ధానికి మరో రెండు రోజుల్లో నాలుగేళ్లు పూర్తి కాబోతున్నాయి. ఇప్పటికీ . యుద్ధం ముగింపునకు అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్నా.. డిమాండ్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఈ క్రమంలో రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులు చేసింది. సరిహద్దు నుంచి 1,400 కి.మీ. దూరంలోని రష్యా ఖండాతర, ఇస్కందర్ క్షిపణులను ఉత్పత్తి చేసే ఉడ్ముర్ట్‌ రిపబ్లిక్‌లోని వొట్కిన్స్క్‌ మెషిన్‌ ప్లాంట్‌పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది..స్వదేశీ సాంకేతికతో తయారు చేసిన 3 వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను చేధించే ఫ్లెమింగో క్షిపణులను ఉక్రెయిన్ ప్రయోగించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రష్యా ఆదివారం సాయంత్రం నుంచి మాస్కో పరిధిలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలను మూసివేసింది. గగనతల రక్షణ దళాలు గంటలోపు 11 ఉక్రెయిన్ డ్రోన్‌లను కూల్చివేసినందున, తదుపరి నోటీసులు వచ్చే వరకు రాజధానిలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలను భద్రతా కారణాలతో ఆదివారం మధ్యాహ్నం మూసివేసినట్టు రష్యా పౌర విమానయాన విభాగం రోసావియాట్సియా పేర్కొంది. డోమోడెడోవో, వ్నుకోవో, జుకోవ్స్కీ,షెరెమెటియేవో అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎయిర్‌ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు తెలిపింది. గతంలో వ్యక్తం చేశారు.మాస్కో గగనతలం మీదుగా వెళ్తోన్న యూఏవీను వాయు రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్టు మేయర్ సెర్గే సొబైనిన్ తెలిపారు. మొత్తం 11 డ్రోన్లను కూల్చివేశామని ఆయన తెలిపారు. యుద్ధం మొదలైన నాలుగేళ్లు పూర్తవుతున్నా.. ఉక్రెయిన్ తరుచూ తమ భూభాగంలోని వివిధ ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులు చేస్తోందని రష్యా ఆరోపిస్తోంది. రష్యా సైతం క్షిపణులు, డ్రోన్లతో దాడుల కొనసాగిస్తోంది. ఇప్పటి వరకూ ఈ యుద్ధం భారీ ప్రాణనష్టం సంభవించింది. ఏకంగా 4.65 లక్షల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన, కనిపించకుండాపోయిన సైనికుల సంఖ్య లేక్కలేదు. వీళ్లు 20 లక్షలుపైనే ఉంటారు. అలాగే, కొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా తొలిసారి ఆస్థాయిలో శరణార్థుల సమస్యను ఎదుర్కొంటోంది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీలపై నాటి సోవియట్‌ యూనియన్‌ 1,418 రోజులు పోరాడింది. ఇప్పుడు ఉక్రెయినపై కొనసాగుతోన్న దండయాత్రకు ఈ ఏడాది జనవరితో 1,418 రోజులు పూర్తయ్యింది. వాస్తవానికి ఉక్రెయిన్‌ను వారం పది రోజుల్లోనే దారికి తెచ్చుకుంటామని రష్యా భావించింది. కానీ, కీవ్ నుంచి ఊహించని ప్రతిఘటనతో దాని అంచనాలు తారుమారయ్యాయి. నాలుగేళ్లుగా రష్యా చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. 2014 స్వాధీనం చేసుకున్న క్రిమియాతో పాటు 20 శాతం ఉక్రెయిన్ భూబాగం రష్యా అధీనంలో ఉన్నా... కీవ్ సైన్యాల పోరాట శక్తికి ముందు మాస్కో సేనలు నిలవలేకపోతున్నాయి.