రైతులకు గుడ్ న్యూస్.. ఆ ప్రక్రియ పూర్తి చేసిన వారందరికీ డబ్బులు.. నో టెన్షన్..

Wait 5 sec.

రాష్ట్రంలోని రైతులకు అండగా ఉండేందుకు పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిపి అమలు చేస్తున్నారు. పథకం తొలివిడత నిధులను ఆగస్ట్ 4వ తేదీన విడుదల కూడా చేశారు. పీఎం కిసాన్ యోజన సాయం రెండు వేల రూపాయలతో పాటుగా అన్నదాత సుఖీభవ పథకం కింద అందించే రూ.5000 కలిపి అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.7000 జమ చేశారు. సుమారుగా రాష్ట్రంలోని 47 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖిభవ పథకం కింద సాయం అందింది. అయితే ఈ కేవైసీ, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ వంటి సమస్యల కారణంగా అక్కడక్కడా అందలేదు. ఈ నేపథ్యంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఈ- కేవైసీ పూర్తి చేసుకున్నకింద పెట్టుబడి సాయాన్ని వారి బ్యాంక్ ఖాతాల్లో జ‌మ చేయ‌నున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ డబ్బులను విడతల వారీగా జమ చేస్తామన్న అచ్చెన్నాయుడు.. రైతులు తమ ఖాతాలో డబ్బు పడలేదని నిరుత్సాహ పడొద్దని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సాయం అందుతుందని భరోసా ఇచ్చారు. మరోవైపు ఏపీలో యూరియా సరఫరాపై మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. యూరియా నిల్వలు, పంపిణీ, స‌ర‌ఫ‌రాల‌పై క‌లెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన అచ్చెన్నాయుడు.. సరఫరాలో సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం రబీ సీజన్ కోసం రాష్ట్రానికి ఇప్పటికే 9.5 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల ఎరువులు కేటాయించిందని.. రైతులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని అన్నారు. యూరియా నిల్వలపై క్షేత్రస్థాయిలో లెక్కలకు, అధికారిక లెక్కలకు తేడా లేకుండా చూడాలని ఆదేశించారు. యూరియా సరఫరాకు సంబంధించి వైఎస్సార్ కడప, కృష్ణా, బాప‌ట్ల జిల్లాల్లో ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయని.. ఆయా జిల్లాల క‌లెక్టర్లు సత్వరమే స్పందించి స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించాల‌ని ఆదేశించారు. నిల్వలు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల నుంచి.. యూరియాను డిమాండ్ ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల‌కు స‌ర‌ఫ‌రా చేసేలా చ‌ర్యలు చేప‌ట్టాలని.. ఇందుకోసం ర‌వాణా ఖ‌ర్చుల‌ను ప్రభుత్వం భరించేలా చూస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.