ముంబై కా రాజా రోహిత్ శర్మ.. ముంబైలో హిట్‌మ్యాన్ క్రేజ్ చూశారా..!

Wait 5 sec.

టీమిండియా వన్డే టీమ్ కెప్టెన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతడని చూసేందుకే.. చాలా మంది ఫ్యాన్స్ స్టేడియాలకు పోటెత్తుతారు. అతడు ఎక్కడికైనా వస్తున్నాడని తెలిస్తే చాలు వేలాది మంది అక్కడ వాలిపోతారు. అయితే హిట్‌మ్యాన్ కూడా ఫ్యాన్స్‌ను ఎప్పుడూ నిరాశపరచడు. ఫ్యాన్స్‌ ఉత్సాహపరించేందుకు ప్రయత్నిస్తునే ఉంటాడు. తాజాగా రోహిత్ శర్మ చుట్టు ముంబైలో ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో చేరిపోయారు. దీంతో వారి నుంచి తప్పించుకుని వెళ్లేందుకు అతడు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. గణపతి పూజల కోసం రోహిత్ శర్మ.. ముంబైలోని వర్లికి వెళ్లాడు. తమ అభిమాన క్రికెటర్ వస్తున్నాడని తెలుసుకున్న ఫ్యాన్స్.. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. రోహిత్ కారులో వచ్చిన వెంటనే.. అతడిని చుట్టుముట్టారు. దీంతో రోహిత్‌.. కారు సన్‌రూఫ్‌ నుంచి బయటకు వచ్చి చేతులు ఊపుతూ, ఫ్యాన్స్‌కు అభివాదం చేశాడు. దీంతో ఫ్యాన్స్ సంతోషంలో.. ‘ముంబయి కా రాజా రోహిత్ శర్మ’ అంటూ బిగ్గరగా అరిచారు. దీంతో కాసేపు రోహిత్ శర్మ ప్రయాణిస్తున్న కారు ఎటూ కదలలేకపోయింది. భారీగా ఫ్యాన్స్ చేరడంతో ముందుకు వెళ్లడం కష్టమైంది. ఆ తర్వాత అతి కష్టం మీద అక్కడి నుంచి బయలుదేరింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగారోహిత్‌ శర్మ ఇటీవలే బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో ఫిట్‌నెస్‌ పరీక్షలో పాల్గొన్నాడు. ఈజీగానే ఫిట్‌నెస్ టెస్ట్‌ను క్లియర్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడేందుకు అర్హత సాధించాడు. ఇప్పటికే టెస్ట్, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు. హిట్‌మ్యాన్‌ చివరిసారిగా ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా తరఫున ఆడాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో 76 రన్స్ చేసి.. భారత జట్టు ట్రోఫీ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. హిట్‌ మ్యాన్‌ ఇప్పటివరకు 273 వన్డేల్లో 11,168 రన్స్ చేశాడు. ఇందులో 32 సెంచరీలు, 58 హాఫ్‌ సెంచరీలున్నాయి.