ఏపీ అసెంబ్లీ సమావేశాలకు మహూర్తం ఫిక్స్.. ఆ రోజు నుంచే, ఛాలెంజ్‌కు వైసీపీ సిద్ధమా!

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, అదే రోజు ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు సమావేశం తర్వాత.. రెండు సభల బీఏసీ సమావేశాలు జరుగుతాయి. ఈ బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి.. ఎజెండా వంటి అంశాలపై నిర్ణయం తీసుకుంటారు.*మరోవైపు ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ఈ సారైనా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇస్తేనే సభకు వస్తామని వైసీపీ నేతలు చెప్తుండగా.. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలని ప్రభుత్వం చెప్తోంది. రూల్స్ ప్రకారం వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని ఏపీ ప్రభుత్వం వాదన. ఈ నేపథ్యంలో ఈసారి సమావేశాలకు కూడా వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు వరుసగా 60 అసెంబ్లీ పని దినాల పాటు శాసనసభకు హజరు కాకపోతే, అనర్హత వేటు పడుతుందని ఏపీ డిప్యూటి స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఇప్పటికే స్పష్టం చేశారు. *వైఎస్ జగన్ 60 రోజులపాటు అసెంబ్లీకి రాకపోతే డిస్ క్వాలిఫై అవుతారని రఘురామ చెప్తున్నారు. అదే జరిగితే పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తాయంటున్నారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా, పెద్దవాడిగా వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని కోరుతున్నానని అన్నారు. అటు సీఎం చంద్రబాబు కూడా ఇటీవల వైసీపీకి ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్‌‍కు చంద్రబాబు ఛాలెంజ్ చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాగా.. వైసీపీ సమావేశాలకు వస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. *మరోవైపు వైసీపీకి శాసనసభలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే శాసనసభ నిబంధనల ప్రకారం మొత్తం సామర్థ్యంలో పది శాతం మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని ప్రభుత్వం చెప్తోంది. ఈ లెక్కన ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 19 మంది సభ్యులు ఉండాలి.