పోలీసులపై కాల్పుల వ్యవహారం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌కు చెందిన బాలాజీ అనే డాక్టర్‌ను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లోనే తరచుగా డ్రగ్స్ పార్టీలు నిర్వహించేవారని గుర్తించారు. డాక్టర్ బాలాజీ ఇంటిని.. ఒక డెన్‌గా ఉపయోగించుకుంటూ.. పైలట్ రోహిత్‌ రెడ్డి, ఆయన సోదరుడు రితేశ్‌ రెడ్డి సహా మరికొంతమంది ప్రతీ నెలా డ్రగ్స్‌ పార్టీలు చేస్తున్నట్లు సిట్ అధికారుల విచారణలో తేలింది. అదే సమయంలో డాక్టర్ బాలాజీ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. డాక్టర్ బాలాజీని అదుపులోకి తీసుకుని విచారణ జరిపిన సిట్ అధికారులకు మరిన్ని సంచలన విషయాలు తెలిశాయి. రాకేష్ వర్మ అనే డ్రగ్‌ పెడ్లర్‌ నుంచి డాక్టర్ బాలాజీ.. ఎండీఎంఏ సహా మరికొన్ని రకాల డ్రగ్స్‌ను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అలా కొనుగోలు చేసిన డ్రగ్స్‌ను పైలట్ రోహిత్‌ రెడ్డి సహా పలువురు వినియోగించారని.. వాటికి సంబంధించిన కొన్ని ట్రాన్సాక్షన్లను కూడా సిట్ అధికారులు సేకరించారు.సిట్ అధికారులు చేస్తున్న తాజా దర్యాప్తులో మరికొందరు కొత్త వ్యక్తుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు ఈ డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు 11 మందిని నిందితులుగా గుర్తించగా.. తాజాగా డాక్టర్ బాలాజీని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి డాక్టర్ బాలాజీ ఇంటికి వెళ్లి సోదాలు చేసిన సిట్ అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ బాలాజీతో కలిపితే ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య 15కి పెరిగింది. మరోవైపు.. ఈ కేసులో కీలకంగా ఉన్న డ్రగ్ పెడ్లర్.. రాకేష్ వర్మ ప్రస్తుతం రాజస్థాన్‌లో ఉన్నట్లు గుర్తించిన సిట్ అధికారులు అతడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. మరోవైపు.. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు పైలట్ రోహిత్‌ రెడ్డి, రితేష్ రెడ్డి, ఢిల్లీ బిజినెస్‌మెన్ నమిత్‌ శర్మలను.. సిట్‌ అధికారులు కోర్టు అనుమతితో రెండో రోజు కస్టడీలోకి తీసుకుని విచారణ చేశారు. ఈ దర్యాప్తులో దాదాపు 5 ఏళ్ల నుంచి పైలట్ రోహిత్‌ రెడ్డికి డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీని కోసం కొందరు డ్రగ్‌ పెడ్లర్లతో సంబంధాలు, చాలా ట్రాన్సాక్షన్లకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. గతంలో కొన్ని డ్రగ్స్‌ కేసుల్లో పైలట్ రోహిత్‌ రెడ్డి పేరు బయటికి రాగా.. దానిపైనా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.రెండో రోజు కస్టడీలో ప్రధానంగా ఈ కేసులో ప్రధానంగా ఉన్న 11 మంది నిందితుల మధ్య సంబంధాలపై ఆరా తీశారు. వీరు తరచూ ఎందుకు కలుస్తున్నారు అనేది ప్రశ్నించారు. కొన్ని అనుమానాస్పద ట్రాన్సాక్షన్లను గుర్తించారు. నిందితులు వేర్వేరు ప్రాంతాల్లో డ్రగ్స్‌ సేవించినట్లు ఆధారాలు సేకరించారు. ఈనెల 14వ తేదీ మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ పార్టీకి 2 రకాల డ్రగ్స్‌ ఉపయోగించినట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మొదట కొకైన్‌ ఆ తర్వాత ఎండీఎంఏ డ్రగ్స్‌ తీసుకొచ్చినట్లు సమాచారం.తెలంగాణ ఈగల్ టీమ్, మొయినాబాద్ పోలీసులు.. ఫామ్‌హౌస్‌ డ్రగ్స్ వినియోగించడంతో మిగిలిపోయిన 0.26 గ్రాముల కొకైన్‌‌ను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు డ్రగ్స్‌‌ను మద్యంలో కలిపి సేవించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే పైలట్ రోహిత్‌ రెడ్డి, రితేష్ రెడ్డి, కౌశిక్‌ రవి, అర్జున్‌ రెడ్డి నలుగురికీ కొకైన్‌ పాజిటివ్‌ వచ్చిందని.. ఇక నమిత్‌ శర్మ శాంపిల్స్‌లో యాంఫిటమిన్, మెథా యాంఫిటమిన్, కొకైన్‌ ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. మరోవైపు.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌ శాంపిల్స్‌లో యాంఫిటమిన్, మెథా యాంఫిటమిన్‌ ఉన్నట్లు వెల్లడైంది.