ఏపీలో మరోసారి చర్చనీయాంశమైంది. మరణించి ఏడాది పూర్తైన సందర్భంగా ప్రవీణ్ పగడాల సంస్మరణ దినం నిర్వహించారు. ఈ సందర్భంగా మరోసారి చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో ప్రవీణ్ పగడాల సంస్మరణ దినంల చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను విమర్శిస్తూ పాస్టర్ అజయ్ బాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆంధ్రలో కోడిని కోస్తే జైలు.. మనిషిని చంపితే బెయిల్ అనే రీతిలో పాలన సాగుతోందంటూ పాస్టర్ అజయ్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచార ఘటనల్లో నిందితుల పట్ల పక్షపాతం చూపిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డూ గురించి తప్ప.. ఇతర ప్రజా సమస్యలపై మాట్లాడిన పాపాన పోలేదని విమర్శించారు. ఇస్లాం, క్రైస్తవ మతాలలో ఇలా జరిగితే అల్లకల్లోలం చేసేవారంటూ పవన్ కళ్యాణ్ అన్నారని విమర్శించారు. క్రైస్తవుల మీద జరిగినన్ని దాడులు ప్రపంచ చరిత్రలో ఎవరి మీదా జరగలేదని అన్నారు. మనుషులను ఇష్టపడాలని.. మతాలను కాదని సూచించారు. మరోవైపు సంస్మరణ సభలో మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల తాగి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారని.. చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడే పద్ధతి ఇదేనా అని ప్రశ్నించారు. ప్రవీణ్ పగడాలను చంపింది ఎవరో సీఎం చంద్రబాబుకు తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య స్కెచ్ ఎవరు వేశారో చంద్రబాబుకు తెలుసని.. కేంద్ర ప్రభుత్వంలోని పెద్ద మనిషి ఈ పని చేయించారంటూ హర్షకుమార్ ఆరోపించారు. మరోవైపు పాస్టర్ ప్రవీణ్ పగడాల మద్యం మత్తులో బైక్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదం జరిగి చనిపోయినట్లు పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. టెక్నాలజీ సాయంతో దర్యాప్తు జరిపిన పోలీసులు.. రోడ్డు ప్రమాదంలోనే ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు తేల్చారు. అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాలది హత్య అని అప్పట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే విచారణలో పోలీసులు వీటికి ఫుల్ స్టాప్ పెట్టారు.