ఏపీ హైకోర్టులో పవన్ కళ్యాణ్‌కు ఊరట.. మాజీ IAS వేసిన పిటిషన్ కొట్టేసిన న్యాయమూర్తి

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు హైకోర్టులో ఊరట దక్కింది. పవన్ సినిమాల్లో నటించకుండా నిలువరించాలని దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కోసం, ఇతర కార్యక్రమాల కోసం పవన్ ప్రభుత్వ నిధులు, అధికార యంత్రాన్ని దుర్వినియోగం చేశారని మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై సతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.. విజయ్‌కుమార్ తరఫున లాయర్ వాదనలు వినిపించారు. డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న నటించడం అనైతికమని వాదించారు. హరిహరవీరమల్లు సినిమాకు సంబంధించి టికెట్‌ ధరల పెంపు విషయంలోనూ నిబంధనలు పాటించలేదని కోర్టుకు తెలిపారు. సినిమా ప్రమోషన్ కోసం పవన్‌ అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రుల హోదాల్లో ఉన్న వ్యక్తులు సినిమాల్లో నటించడంపై ఎలాంటి నిషేధం లేదని అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, అడిషనల్ ఏజీ సాంబశివ ప్రతాప్‌ వాదనలు వినిపించారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ నటుడు ఎన్టీఆర్‌ విషయంలో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. హరిహర వీరమల్లు సినిమా టికెట్‌ ధరల పెంపుపై నిర్మాత అభ్యర్థన మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సినిమా టికెట్ ధరల పెంపునకు, డిప్యూటీ సీఎంకు సంబంధమే లేదన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేందుకు ఆధారాలు కూడా లేవని.. ఈ పిటిషన్ రాజకీయ కారణాలతో దాఖలు చేశారన్నారు. ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని, దీనిని కొట్టివేయాలని కోరారు. ఏజీ, అడిషనల్ ఏజీ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ఇటీవల తీర్పును రిజర్వు చేయగా.. తాజాగా ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు పేర్కొన్నారు.జల్ జీవన్ మిషన్ 2.0పై ఎంవోయూజల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికీ తాగు నీరు అందించాలన్న నిబద్ధతతో ముందుకువెళతామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేస్తే.. కూటమి ప్రభుత్వం మాత్రం కేంద్రంతో మాట్లాడి నిధులు వచ్చేలా చూసిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కేంద్రం మరిన్ని నిధులు కేటాయించాలని కోరారు. జల్ జీవన్ మిషన్ 2.0కి సంబంధించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి మంత్రి సమక్షంలో కేంద్రం తరఫున జల్ శక్తి మంత్రిత్వశాఖ. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంచయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులు ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. 'జల్ జీవన్ మిషన్ 2.0 లక్ష్యాలకు అనుగుణంగా 2028 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందించే ప్రక్రియను పూర్తి చేయాలి' అని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ సూచించింది.