సిద్దిపేటలో ఎవరో ఎందుకు.. రేవంత్ రెడ్డే పోటీ చేయాలి.. హరీష్ రావు సవాల్

Wait 5 sec.

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత .. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం నియోజకవర్గ ప్రజలకు కీలక పిలుపునుచ్చారు. వచ్చే ఎన్నికల్లో కేబినెట్‌లోకి తీసుకుంటానని పేర్కొన్నారు. అయితే ఆ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన హరీష్ రావు.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరో అవసరం లేదని స్వయంగా రేవంత్ రెడ్డే వచ్చి సిద్దిపేటలో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు వాళ్లు, వీళ్లు ఎందుకని ప్రశ్నించిన హరీష్ రావు.. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆయనే తనపై పోటీకి రావాలని సవాల్ విసిరారు. సిద్దిపేటలో రేవంత్‌ రెడ్డిని తనపై పోటీకి ఆహ్వానిస్తున్నట్లు హరీష్ రావు వెల్లడించారు. మళ్లీ తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని పగటి కలలు కంటున్నారని చెప్పిన హరీష్ రావు.. తలకిందులుగా తపస్సు చేసినా ఆయన మళ్లీ సీఎం కారని తేల్చి చెప్పారు. అదే సమయంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌లోకి చేరతారో లేదో చెప్పడం కంటే చూస్తేనే బాగుంటుందని హరీష్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న నియోజకవర్గాల పునర్విభజనతో బీఆర్ఎస్ పార్టీకి మేలు జరుగుతుందని హరీష్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిన హరీష్ రావు.. తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఎప్పుడు, ఎలా గోల్ కొట్టాలో తమకు బాగా తెలుసని పేర్కొన్న హరీష్ రావు.. సమయం వచ్చినప్పుడు తమ సత్తా చాటుతామని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డికి ఇదే చివరి టర్మ్ అని జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని.. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు అన్నదాతలను కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేసిందని హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనను తమ పార్టీ స్వాగతిస్తున్నామని హరీష్ రావు స్పష్టం చేశారు. కానీ గతంలో కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు కుటుంబ నియంత్రణను కఠినంగా పాటించినందుకు దక్షిణ భారత రాష్ట్రాలకు ఆర్థికంగా, రాజకీయంగా నష్టం జరగడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.