ఏపీలో కొత్త రాజకీయ పార్టీ.. క్రైస్తవుల తరఫున పోరాటం.. వచ్చే ఎన్నికల్లో పది స్థానాల్లో పోటీ..!

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటైంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రథమ వర్ధంతి రోజునే.. క్రైస్తవుల కోసమంటూ ‘భరోసా’ పార్టీ ఆవిర్భవించింది. సిటిజన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న ఈ పార్టీని ఏర్పాటు చేశారు. అభినయ్ దర్శన్‌ది కడపలోని ఎర్రముక్కపల్లి. మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌ది కూడా కడప జిల్లా అనే సంగతి తెలిసిందే. అభినయ్ తన ఆవిర్భావ సభను కాకినాడలో నిర్వహించారు. రాష్ట్రంలోని క్రైస్తవుల తరఫున పోరాడటం కోసం తాను పార్టీని ఏర్పాటు చేసినట్లు అభినయ్ ప్రకటించారు. ఎరుపు, ముదురు నీలం రంగులతో కూడిన పార్టీ జెండాను అభినయ్ ఆవిష్కరించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణించి సరిగ్గా ఏడాది పూర్తయిన సమయంలో, ప్రథమ వర్ధంతి రోజున తాను భరోసా పార్టీని ఏర్పాటు చేసినట్లు అభినయ్ దర్శన్ తెలిపారు. క్రైస్తవుడికి కష్టం వస్తే మాట్లాడటానికి తాను ఉన్నానని అభినయ్ తెలిపారు. ప్రవీణ్ పగడాలను ఈ లోకంలో చేశారన్న అభినయ్.. ప్రవీణ్ పగడాల మరణం నిద్రపోతున్న సింహాల లాంటి క్రిస్ట్రియన్లను తట్టి లేపిందన్నారు. దేశానికి ఎన్నో మంచి పనులను క్రైస్తవ మిషనరీలు చేశాయని అభినయ్ చెప్పుకొచ్చారు. ప్రవీణ్ పగడాల గొంతుకను క్రైస్తవ సమాజం కోల్పోయిన రోజునే.. తన గొంతు లేచిందన్నారు.ఏపీలో 2 కోట్ల మంది క్రైస్తవులు..మనకంటూ క్రైస్తవ నాయకులు ఉండాలి. క్రైస్తవుల తరఫున మాట్లాడే వారు అసెంబ్లీలో, పార్లమెంట్‌లో ఉండాలనే లక్ష్యంతో తాను ఈ పార్టీని ఏర్పాటు చేశానని అభినయ్ దర్శన్ తెలిపారు. జనవరి 24న అరకు నుంచి పాదయాత్ర చేపట్టిన.. 24 రోజులపాటు 110 గ్రామాల్లో తిరిగారు. ఏపీ జనాభా 4.5 కోట్లు అయితే అందులో క్రైస్తవులు దాదాపు 2 కోట్ల మంది, అంటే దాదాపు 40 శాతం ఉన్నారని అభినయ్ చెప్పుకొచ్చారు. ఇంత మంది క్రైస్తవులకు కష్టం వస్తే ప్రశ్నించడానికి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేకపోవడం బాధాకరం. మనకంటూ ఓ రాజకీయ పార్టీ ఉండాలనే ఉద్దేశంతో.. నిద్రపోతున్న క్రైస్తవ సమాజాన్ని మేలుకొలిపేందుకు తాను పాదయాత్ర ప్రారంభించానన్నారు. ‘‘ప్రవీణ్ పగడాల చనిపోయిన రోజున నేను రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్‌లోనే ఉన్నాను. 50 వేల మంది జనం అక్కడ న్యాయం కోసం ఎదురు చూస్తే.. చివరికి దక్కింది కడుపుకోత, కన్నీళ్లు, నిరుత్సాహం. అంతటి మహానుభావుణ్ని ఈ లోకంలో లేకుండా చేస్తే.. ఒక్కరూ గొంతు విప్పలేదు. 50 వేల మంది అక్కడ నిలబడి ధర్నాలు చేయడం కంటే.. క్రైస్తవులు తరఫున న్యాయం అడగడానికి అసెంబ్లీలో లేదా పార్లమెంట్‌లో ఒక్కరు ఉంటే మనకు న్యాయం జరిగేది. ఒక్క క్రైస్తవ ఎమ్మెల్యేను అసెంబ్లీకి పంపించండి.. మనకు న్యాయం ఎలా జరగదో చూడండి’’ అని అభినయ్ వ్యాఖ్యానించారు.క్రైస్తవుల్లో ఐక్యత వచ్చింది..‘‘ప్రవీణ్ పగడాల మరణం తర్వాత క్రైస్తవుల్లో ఐక్యత వచ్చింది, మార్పు వచ్చింది.. గతంలో రాజకీయం అంటే పాపం అని మాట్లాడే వాళ్లు. ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం క్రైస్తవుడు కూడా చేయాలని నూటికి 70 శాతం మంది క్రైస్తవులు కోరుకుంటున్నారు. ప్రవీణ్ పగడాల మరణం తర్వాత వచ్చిన మార్పు ఇది. ఓటు అనే పదునైన ఆయుధం మన చేతిలో ఉంది. పార్టీల మీద పగతో కోపంతో కాదు.. ప్రభుత్వానికి నేను వ్యతిరేకం, ఏ నాయకుడికి, ఏ పార్టీకి నేను వ్యతిరేకం కాదు. అవినీతికి, అరాచకానికి నేను వ్యతిరేకిని. నీతిగా, నిజాయితీగా ఓటేసి నాయకుణ్ని ఎన్నుకోవాలని ప్రజలను చైతన్య పరచడానికి నేను రోడ్డెక్కాను’’ అని అభినయ్ తెలిపారు.డబ్బులు పంచకుండా రాజకీయం చేస్తా..డబ్బులు తీసుకొని ఓటేసేవాళ్లు ప్రశ్నించి హక్కును కోల్పోయారన్న అభినయ్.. డబ్బులు తీసుకుని పని చేసే అధికారులు లంచగొండులు అయితే.. ఓటేయడానికి డబ్బులు తీసుకునే ఓటర్లు కూడా లంచగొండులు, అవినీతిపరులే అన్నారు. ఓటును అమ్ముకోవద్దు అని ప్రజలను చైతన్య పరుస్తున్నానని.. నేను ఓటుకు నోటు పంచనని.. డబ్బులు ఇచ్చి ఓటు కొనే పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అభినయ్ ప్రకటించారు.ఇంటి గడప తొక్కనని శపథం..పార్టీ ఏర్పాటు చేయడం కోసం కడపలో తాను ఉంటున్న అద్దె ఇంటిని ఖాళీ చేయడంతోపాటు.. పాదయాత్ర చేపట్టడం కోసం రూ.5 లక్షల విలువైన సామాగ్రిని అమ్మేయమని తల్లిదండ్రులకు చెప్పానన్నారు. ఎన్నికలు అయ్యే వరకు మళ్లీ ఇంటి గడప తొక్కబోనని అభినయ్ స్పష్టం చేశారు. తాను చనిపోయేలోగా.. క్రైస్తవ సమూహానికి అసెంబ్లీలో 30, 40 మంది ఎమ్మెల్యేలను నిలబెట్టాలనే లక్ష్యంతో ఇల్లు దాటి అడుగు బయటపెట్టానన్న అభినయ్. పాదయాత్ర చేసినన్ని రోజులు.. నిరుపేదలా నేను కూడా ప్రతి రోజూ చర్చిలో నేల మీద నిద్రించానన్నారు. ఈ దీక్ష, నిష్ఠ నా ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు కొనసాగుతుందని ప్రకటించారు. అన్యాయానికి గురవుతోన్న ప్రతి సామాన్యుడికి, మతాలకు అతీతంగా తాను గొంతుకను అవుతానన్నారు. పది స్థానాల్లోనే పోటీ చేస్తాం..‘‘ఏ పార్టీ అయినా సరే డబ్బులు ఉన్న వారికే ఎమ్మెల్యే టికెట్ ఇస్తుంది. కానీ నేను మాత్రం నియోజకవర్గంలో గుర్తింపు ఉన్న వారు ముందుకొస్తే.. ఎవర్నీ డబ్బులు అడగను. మీ తరఫున నేనే ప్రచారం చేసి గెలిపిస్తాను. ప్రజలను మెప్పించి, ఒప్పించి మీకు ఓట్లు వేయిస్తాను. వచ్చే ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లో మాత్రమే నా పార్టీ తరఫున అభ్యర్థులను బరిలో ఉంచుతాను. నాతోపాటు కనీసం ఐదుగుర్ని ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటాను. ఇదే నా ఛాలెంజ్. అందుకోసం ఈ మూడేళ్లపాటు ప్రజలతోనే తిరుగుతా, ప్రజల్లోనే ఉంటాను. కేఏ పాల్‌తో తాను కలవడం లేద’’ని అభినవ్ స్పష్టం చేశారు.ఒకప్పుడు సీఎం కూడా క్రిస్టియనే కానీ..‘‘ఒకప్పుడు ముఖ్యమంత్రి కూడా క్రైస్తవుడే. కానీ వారికి పదవి ముఖ్యం, పార్టీ ముఖ్యం, క్రైస్తవుణ్ని కొడుతున్నా, చంపుతున్నా, ప్రార్థనా మందిరాలను కూలగొడుతున్నా వారు మాట్లాడరు. చాలా మంది క్రైస్తవులను అడ్డుపెట్టుకొని, వారి ఓట్లతో అసెంబ్లీకి వెళ్లారు. కానీ క్రైస్తవులకు కష్టం వస్తే అండగా ఉండటం లేదు, ఇదే నా బాధ. 2 కోట్ల మంది జనం ఉన్న క్రైస్తవులకు ఓ ఎమ్మెల్యే, ఎంపీ ఉండాలి. క్రైస్తవ నాయకులందర్నీ కలుపుకొనిపోయే ప్రయత్నం చేస్తాను. నేను నచ్చకపోతే వాళ్ల కాళ్లు పట్టుకోవడానికి కూడా సిద్ధమే’’నని అభినయ్ తెలిపారు.