GHMC స్ట్రిక్ట్ యాక్షన్.. ఆస్తిపన్ను చెల్లించని భవనాలు సీజ్‌

Wait 5 sec.

హైదరాబాద్ నగరంలో ఏళ్ల తరబడి ఆస్తిపన్ను చెల్లించని కమర్షియల్ భవనాలపై జీహెచ్ఎంసీ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చినా.. చేస్తున్నారు. సోమవారం (మార్చి 23) గోషామహల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ సర్కిళ్ల పరిధిలో ఆరు వ్యాపార కేంద్రాలను సంబంధిత డిప్యూటీ కమిషనర్లు సీజ్‌ చేశారు. రూ.6.16 కోట్లు బకాయిలు చెల్లించని కారణంగా సోమాజిగూడలోని కత్రియా హోటల్, రూ.1.28కోట్లు చెల్లించాల్సిన నాంపల్లి అరోరా కళాశాల, రూ.43.78లక్షలు బకాయిపడ్డ గోషామహల్‌లోని సర్న ట్రాన్స్‌పోర్ట్ భవనం, రూ.39.68లక్షలు బకాయిలు పడిన గోషామహల్‌ సోనీ సెంటర్‌ను, రూ.35.27కోట్ల ఆస్తి పన్ను చెల్లించాల్సిన బంజారహిల్స్‌ రోడ్డు నెం.10లోని షమీమ్‌ సుల్తానా వస్త్ర దుకాణం, రూ.17.94లక్షలు చెల్లించాల్సిన పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌లోని సిన్ఫోసిస్‌ బిజినెస్‌ సొల్యూషన్స్‌ సంస్థల భవనాలను అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ.కర్ణన్ ఆస్తి పన్ను చెల్లించకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తాము తీసుకుంటున్న చర్యలతో కొందరు యజమానులు ఏళ్లుగా పేరుకుపోయిన పన్ను చెల్లిస్తున్నారని తెలిపారు. మార్చి నెలాఖరు వరకు మాత్రమే చెల్లించే వెసులుబాటు ఉందని అన్నారు. ఇంకా ఆస్తి పన్ను చెల్లించని బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్యం, అక్రమ నిర్మాణాలు, ఇతరత్రా సమస్యలపై జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 52 ఫిర్యాదులందాయని చెప్పారు. అన్ని అంశాలను పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని కమిషనర్ కర్ణన్ హామీ ఇచ్చారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: సైబరాబాద్ కమిషనర్ప్రజావాణి, వాట్సప్‌, మైక్యూర్‌ మొబైల్‌ యాప్‌లో ప్రజలు పెట్టుకునే అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సీఎంసీ కమిషనర్ సృజన అధికారులను ఆదేశించారు. గడువులోపు ఆయా ఫిర్యాదులను పరిష్కరించకపోతే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల నుంచి వచ్చే అర్జీల్లో ఏవైనా తిరస్కరించాల్సిన పరిస్థితే ఉంటే అందుకుగల కారణాలను స్పష్టంగా రాసి, ఫిర్యాదుదారులకు వివరించాలన్నారు. సరైన కారణాలతోనే తిరస్కరణ చేస్తున్నారా? అనే విషయమై ఇక నుంచి తరచూ తనిఖీలు ఉంటాయని చెప్పారు. జనన, మరణ ధ్రువపత్రాల దరఖాస్తుల ఆమోదం, ఆస్తిపన్ను సమస్యల అర్జీలు, భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తులను గడువులోపు పరిష్కరించాలన్నారు. ఏప్రిల్‌ 1 నుంచి సీఎంసీ ఆధ్వర్యంలో పూర్తిస్థాయి పరిపాలన జరగనుందని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి వంటి వ్యవహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనని కమిషనర్ సృజన హెచ్చరించారు.