తిరుమల శ్రీవారి భక్తులకు కొండపై గదులు దొరక్కపోయినా నో టెన్షన్.. కీలక నిర్ణయం

Wait 5 sec.

, ఇతర అంశాలపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. టీటీడీ పాలకమండలి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, నన్నూరి నర్సిరెడ్డి, మహేందర్‌రెడ్డి, అనుగోలు రంగశ్రీతో కలిసి మాట్లాడారు. గత ప్రభుత్వంలో తిరుమలలో దర్శనాలు, దుకాణాల విషయంలో సరైన పద్ధతి పాటించలేదని, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమల పవిత్రతను కాపాడటానికి ప్రాధాన్యత ఇస్తున్నామని బీఆర్‌ నాయుడు చెప్పారు. సామాన్య భక్తులకు త్వరగా దర్శనం కల్పించడం, లడ్డూల నాణ్యతను మెరుగుపరచడం వంటి అనేక మంచి పనులు చేస్తున్నామని ఆయన తెలిపారు.వసతి గదులపై కీలక నిర్ణయంముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలను కాంక్రీట్‌ జంగిల్‌లా మారకుండా చూస్తున్నామన్నారు. ప్రస్తుతం తిరుమలలో 68 శాతం పచ్చదనం ఉందని, దానిని 80 శాతానికి పెంచుతామన్నారు. లో భక్తులకు వసతి కల్పించడానికి అదనంగా భవనాలు కట్టడం సాధ్యం కాదన్నారు. అందుకే తిరుపతిలో 50 ఎకరాల భూమిని చూశామని, అక్కడ 25వేల మంది భక్తులకు సరిపడా వసతి కల్పించేలా పెద్ద కాంప్లెక్స్‌లు నిర్మించాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. ఈ కాంప్లెక్స్‌ల నుంచి భక్తులను బస్సుల్లో తిరుమలకు తీసుకెళ్లి, దర్శనం చేయించి, తిరిగి కిందకు తీసుకువచ్చే ప్రణాళికను అమలు చేస్తామని టీటీడీ ఛైర్మన్ వివరించారు.తిరుపతి విమానాశ్రయం పేరు మార్పు పాలకమండలి తొలి సమావేశంలోనే అన్యమతస్తులను తొలగించాలని నిర్ణయం తీసుకున్న విషయాన్ని బీఆర్ నాయుడు గుర్తు చేశారు. కొత్త పాలకమండలి వచ్చిన తర్వాత లడ్డూ, అన్నప్రసాదంలో నాణ్యత పెంచామన్నారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో అక్రమంగా 1,500 వాణిజ్య షాపుల్ని కేటాయించారని చెప్పుకొచ్చారు. అలాగే తిరుమల పవిత్రతపై ప్రభావం పడుతుండటంతో వాటిని తొలగించాలని రెవెన్యూశాఖకు చెప్పామన్నారు. తిరుపతిలో ముంతాజ్‌ హోటల్‌కు గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన 20 ఎకరాల భూముల లీజును రద్దుచేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. మరోవైపు రేణిగుంట ఎయిర్‌పోర్టు పేరును మార్చే ప్రతిపాదనలు ఉన్నాయని.. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్‌ పేరును శ్రీ వేంకటేశ్వర ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుగా మార్చే ప్రతిపాదనలు వచ్చాయని.. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుందని తెలిపారు. టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలుమరోవైపు టీటీడీ పాలకమండలి సభ్యుల దర్శన కోటాను గణనీయంగా తగ్గించుకున్నారని టీటీడీ ఛైర్మన్ తెలిపారు. సామాన్యులకు పెద్దపీట వేసేందుకు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామన్నారు. గతం ప్రభుత్వం తిరుపతి ఫ్లైవోవర్‌కు 'శ్రీనివాస సేతు' అని పేరు పెట్టింది. ఇప్పుడు ఆ పేరును 'గరుడ వారధి'గా మార్చినట్లు తెలిపారు. అలాగే, విశాఖ శారదా పీఠానికి కొండపై కేటాయించిన భూముల లీజులను రద్దు చేసినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాల్లో నిత్యాన్నదానం కార్యక్రమాన్ని విస్తృతం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది పాలనలో టీటీడీకి రూ.1,000 కోట్ల విరాళాలు అందినట్లు అధికారులు తెలిపారు. ఒంటిమిట్ట ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం 100 గదులతో కూడిన వసతి గృహాన్ని నిర్మించనున్నారు. దీంతో పాటు, అక్కడ 108 అడుగుల ఎత్తైన జాంబవంతుని విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.