పసిడి బాండ్లతో కనకవర్షం.. గ్రాముపైనే రూ. 9 వేలకుపైగా లాభం.. ధరల ప్రకటన

Wait 5 sec.

Gold Bond Returns: .. సావరిన్ గోల్డ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి కాసుల వర్షం కురుస్తోంది. ఎన్నో రెట్ల మేర లాభం అందుకుంటున్నారు ఇన్వెస్టర్లు. చాలా మంది ఇదే తరుణంలో మిస్ అయ్యాం కదా అని బాధపడుతున్నారు. ఇప్పుడు 2017-18 సిరీస్ VI ఫైనల్ రిడెంప్షన్ ధరల్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా () ప్రకటించింది. ఈ గోల్డ్ బాండ్లను 2025, నవంబర్ 6 నుంచి రిడీమ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ గోల్డ్ బాండ్ సిరీస్‌ను 2017 నవంబర్ 6న ఇష్యూ చేసింది. దీంతో ఇప్పుడు 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. గోల్డ్ బాండ్ల కాల పరిమితి 8 సంవత్సరాలే అయినప్పటికీ.. ఐదేళ్లు దాటితే మెచ్యూరిటీకి ముందుగానే విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. >> ఇప్పుడు 2017-18 సిరీస్- VI గోల్డ్ బాండ్లకు సంబంధించి.. తుది విమోచన ధరను (ఫైనల్ రిడెంప్షన్ ప్రైస్) ప్రకటించింది. ఇక్కడ గ్రాముకు రూ. 12,066 గా నిర్ణయించింది. ఇక ఈ గోల్డ్ బాండ్ ఇష్యూ చేసిన సమయంలో గ్రాము ధర కేవలం రూ. 2,945 గానే ఉంది. ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసి.. డిజిటల్‌గా పేమెంట్ చేస్తే గ్రామపై రూ. 50 అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. అంటే అప్పుడు గ్రాముకు రూ. 2,895 చొప్పున పడుతుంది. ఈ క్రమంలోనే 8 ఏళ్ల వ్యవధిలో.. గోల్డ్ బాండ్లపై 300 శాతానికి మించి రాబడి వచ్చింది. తీసేయాలి. అప్పుడు రూ. 12,066- రూ. 2,895= రూ. 9,161. అంటే గ్రాముపైనే ఇంత లాభం (వడ్డీ కాకుండా) వచ్చింది. దీనిని శాతంగా లెక్కిస్తే.. (9161/2,895)X 100= 316.7 శాతం. అంటే గోల్డ్ బాండ్లపై 316 శాతం రాబడి వచ్చింది. ఇదే సమయంలో ఈ సిరీస్ గోల్డ్ బాండ్ల వడ్డీ రేటు వార్షిక ప్రాతిపదికన 2.50 శాతంగా ఉండగా.. లాభం ఇంకా ఎక్కువే వస్తుందని చెప్పొచ్చు.భౌతిక బంగారం కొనుగోళ్లు తగ్గించాలనే ఉద్దేశంతో.. కేంద్ర ప్రభుత్వం గతంలో లాంఛ్ చేసింది. కేంద్రం తరఫున ఆర్బీఐ ఈ గోల్డ్ బాండ్లను జారీ చేస్తుంది. ఇంకా.. ఇష్యూ డేట్, రిడెంప్షన్ డేట్‌కు ముందటి 3 రోజుల సగటు ధర ఆధారంగా.. ధరల్ని నిర్ణయిస్తారు. కనీసం గ్రాము (యూనిట్) నుంచి గరిష్టంగా 4 కిలోల వరకు కొనుగోలు చేయొచ్చు. ఇక్కడ గోల్డ్ బాండ్లపై వచ్చిన లాభాలపై టాక్స్ ఉండదు. ఇక గోల్డ్ బాండ్ల వల్ల.. ప్రభుత్వ ఖజానాపై భారం ఎక్కువగా పడుతున్న క్రమంలో.. వీటిని ఇటీవలి కాలంలో జారీ చేయట్లేదు.