‘చికిరి చికిరి’ సాంగ్.. పెద్ది పాట ఎంత పెద్ద రికార్డ్ కొట్టిందో తెలుసా బ్రో.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే..

Wait 5 sec.

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'పెద్ది'. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకొని షూటింగ్ చేస్తున్నారు. అప్పుడే ప్రమోషన్స్ కూడా షురూ చేశారు. ఇటీవలే ‘చికిరి చికిరి’ అనే ఫస్ట్ సింగిల్ లాంచ్ చేశారు. దీనికి ఆడియన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. లేటెస్టుగా ఈ సాంగ్ న్యూ రికార్డ్ క్రియేట్ చేసింది.'పెద్ది' మూవీకి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే మూడు పాటలు రికార్డ్ చేసి రెడీగా పెట్టారు. ముందుగా ‘చికిరి చికిరి’ పాటను నవంబర్ 7వ తేదీన రిలీజ్ చేశారు. లిరికల్ వీడియో కాకుండా, ఏకంగా ఫుల్ వీడియో సాంగ్ వదిలారు. ఇది మెగా అభిమానులనే కాదు, సాధారణ ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఒకటీ రెండు స్టెప్పులపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగినప్పటికీ, ఓవరాల్ సాంగ్ మాత్రం అందరికీ నచ్చేసింది. ‘చికిరి చికిరి’ పాటకి యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్, లక్షల కొలదీ లైక్స్ తో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. వ్యూస్ పరంగా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. 13 గంటల్లోనే 32 మిలియన్ల వ్యూస్‌ సాధించిన ఈ సాంగ్.. 24 గంటల్లోనే 46 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇండియన్‌ సినిమా చరిత్రలోనే ఒక్క రోజులోనే అత్యధిక వ్యూస్‌ సాధించిన ఫస్ట్ సాంగ్‌గా రికార్డు నెలకొల్పిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో 24 గంటల్లో 32 మిలియన్ల వ్యూస్‌ సాధించిన గత రికార్డులను ఈ పాట బద్దలుకొట్టింది. అంతేకాదు ఈ పాటకి 1 మిలియన్ కి పైగా లైక్స్ కూడా వచ్చాయి.రెహమాన్ కంపోజ్ చేసిన ‘చికిరి చికిరి’ పాటని మోహిత్‌ చౌహాన్‌ ఆలపించారు. లిరిసిస్ట్ బాలాజీ సాహిత్యం అందించారు. తెలుగుతో పాటుగా హిందీ, కన్నడ, మలయాళ, తమిళ వెర్షన్స్ రిలీజ్ చేశారు. అన్ని భాషల్లోనూ ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. రామ్ చరణ్ ఎనర్జిటిక్ స్టెప్పులు, విలేజ్ గర్ల్ గా జాన్వీ కపూర్ గ్లామర్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బ్యూటిఫుల్ మ్యూజిక్ కి విజువల్స్ కూడా తోడయ్యాయి. ఇవన్నీ కలిసి ‘చికిరి చికిరి’ని ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ గా నిలిపాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్ లో 'పెద్ది' సినిమా తెరకెక్కుతోంది. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. 2026 మార్చి 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ()