గత సంవత్సరం ఆగస్టు నెలలో చేసిన వర్షాలు.. ఈ సారి స్థితికి నెట్టాయి. కుండపోత వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించి పోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వడంతో అక్కడి స్థానికులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వర్షాలు, వరద తగ్గిన తర్వాత వారిని తమ స్వస్థలాలకు పంపించేశారు. అయితే.. వర్షాల కారణంగా తెలంగాణలో రైల్వే సర్వీసులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో తలమడ్ల సమీపంలో ట్రాక్ కొట్టుకుపోవడంతో సికింద్రాబాద్–నిజామాబాద్ మధ్య రైళ్లు మూడు రోజుల పాటు పూర్తిగా నిలిచిపోయాయి. రవాణా అంతరాయం వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. అయితే రైల్వే అధికారులు అత్యవసరంగా బృందాలను పంపించి, దాదాపు 36 గంటలపాటు మరమ్మతు పనులు జరిపి ట్రాక్‌ను మళ్లీ సిద్ధం చేశారు. మొదట ఒక డెమో ట్రైన్ నడిపి సేఫ్టీ చెక్ చేసిన అనంతరం సర్వీసులు మళ్లీ ప్రారంభించారు. తిరుపతి–నిజామాబాద్ రాయలసీమ ఎక్స్‌ప్రెస్ తలమడ్ల స్టేషన్ మీదుగా నడవడం రైళ్ల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్న సంకేతంగా నిలిచింది. ఈ వరదల ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే తమ నిత్య సేవల్లో పలు మార్పులు చేసింది. కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేయాల్సి వచ్చి.. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేయడం లేదా కొత్త టైమ్‌టేబుల్ ప్రకారం నడపడం జరిగింది. భిక్నూర్–తలమడ్ల, అక్కన్నపేట–మెదక్, గజ్వేల్–లకుడారం, బోల్సా–కర్ఖేలి మధ్య సెక్షన్లు నీటమునిగిన కారణంగా రైలు సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. ఫలితంగా... ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే రైల్వే అధికారులు ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేశారు. ఇండియన్ రైల్వే, దక్షిణ మధ్య , మార్గమార్పులు, రీషెడ్యూల్ వివరాలను అందించి ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇచ్చాయి. ప్రస్తుతానికి ట్రాక్ మరమ్మతులు పూర్తయి సర్వీసులు పునరుద్ధరించబడటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి అవాంతరాలు రాకుండా వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అదనపు భద్రతా చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఈ చర్యలతో రాబోయే మాన్సూన్ కాలంలో రైల్వే రవాణా మరింత సురక్షితంగా ఉంటుందని భావిస్తున్నారు.