ఏపీలో వారికి సెప్టెంబర్ 1న పింఛన్ డబ్బులు ఇవ్వరు.. వెంటనే ఇలా చేయండి, కీలక అప్డేట్

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల కోటాలో పింఛన్ తీసుకుంటున్నవారిలో అనర్హులకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే నోటీసులు జారీ చేసిన వారిలో అర్హత ఉంటే కనుక మరోసారి అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు సీఎస్ విజయానంద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పింఛన్ల పంపిణీలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని ఆదేశించారు. ఎక్కడైనా ఫిర్యాదు వస్తే జిల్లా కలెక్టర్లే బాధ్యత వహించాలని సూచించారు. లో జిల్లా కలెక్టర్ల నుంచి మండల స్థాయి అధికారులు అందరూ పాల్గొనాలని విజయానంద్ అన్నారు. పింఛన్ల తనిఖీలో భాగంగా 1.35 లక్షల మందికి నోటీసులు ఇచ్చామని. వీరిలో.88,319 మంది ఎంపీడీవోలకు అప్పీలు చేసుకున్నారని.. ఇంకా 23 వేల మంది అప్పీలు చేసుకోలేదన్నారు. పింఛన్లకు సంబంధించిన సమస్యల్ని నెల రోజుల్లో పరిష్కరించాలని సీఎస్ ఆదేశించారు.ఇదిలా ఉంటే దివ్యాంగుల కోటాలో అందుకున్నవారు వెంటనే అప్పీల్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇలా అప్పీల్ చేసుకున్నవారందరికి సెప్టెంబర్ 1న పింఛన్ అంజేస్తారు. ఎవరైతే అప్పీల్ చేసుకోరో వారి పింఛన్ నిలిపివేస్తారు. కాబట్టి నోటీసులు అందుకున్నవారు వెంటనే దగ్గరలోని ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపాలిటీ పరిధిలో అధికారులకు అప్పీల్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ అప్పీల్ చేసుకోకపోతే సెప్టెంబర్ 1 నుంచి పించన్ నిలిపివేస్తారు. అయితే పింఛన్ రద్దు నోటీసులు అందుకున్న వారిలో ఇప్పటికి 80% అప్పీల్ చేసుకున్నారని.. మిగిలిన 20%మంది ఈ నెల 29-8-2025 సాయంత్రం లోపల అప్పీల్ చేసుకోవాలని సూచించారు. ఆఫ్‌లైన్‌లో ‌అప్పీల్ చేసుకునేందుకు ఈ నెల 29 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది. అదే ఆన్‌లైన్‌లో అయితే ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉంది. ఈ విషయాన్ని గమనించి అప్పీల్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఏవైనా అనుమానాలు ఉంటే దగ్గరలోని సచివాలయంలో సంప్రదించాలి.. ఈ నెల 30లోగా అప్పీల్ చేసుకోవడం మర్చిపోవద్దు. అందుకున్న వారు ఎంపీడీవోకు అప్పీల్ చేసుకుంటూ ఒక లేఖ రాయాలి.. ఆధార్ కార్డు, రేషన్ కార్డు కాపీలు.. పింఛన్ రద్దు/పింఛన్ మార్పు నోటీసు.. సదరం సర్టిఫికేట్ (పాతది).. సదరం సర్టిఫికేట్ (కొత్తది) ఉండాలి. అలాగే పింఛన్ లబ్ధిదారులకు సంబంధించిన ఏవైనా హాస్పిటల్ చికిత్స పొందిన/పొందుతున్న డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే కూడా సమర్పించాలి. అప్పీల్ చేసుకున్నవారికి ఎంపీడీవో Reassement కు నోటీసు జారీ చేస్తారు. అప్పుడు పింఛన్ లబ్ధిదారులు మరొకసారి Reasssement కొరకు హాజరవుతారు. అయితే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. అప్పీల్ చేసుకున్నవారికి ప్రభుత్వం సెప్టెంబర్ 1న పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఆ తర్వాతే Reassement ఉంటుందని చెబుతున్నారు. అలాగే దివ్యాంగుల కోటాలో నోటీసులు అందుకున్న వారిలో వితంతు పింఛన్‌కు అర్హులైన వారిని ఆ కేటగిరిలోకి మార్చేశారు.