శ్రీలంక జట్టులోకి హసరంగా రీ ఎంట్రీ.. ఆసియా కప్ స్క్వాడ్ ఇదే!

Wait 5 sec.

జట్టులో చాలా కాలం తన హవా కొనసాగించాడు. అయితే, కొంతకాలంగా ఫామ్ లేక, వరుస గాయాలతో సతమతమవుతున్న అతనికి శ్రీలంక క్రికెట్ బోర్డు మరోసారి అవకాశం ఇచ్చింది. స్క్వాడ్‌లో హసరంగ చోటు దక్కించుకున్నాడు. శ్రీలంక ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉంది. అయితే ఈ సిరీస్‌లో హసరంగను సెలక్ట్ చేయలేదు. కానీ, కోసం మాత్రం వనిందుని ప్రత్యేకంగా తీసుకున్నారు. శుక్రవారం నుంచి జింబాబ్వే - శ్రీలంక సిరీస్ ప్రారంభం కానుంది. రెండు వన్డేలతో పాటు మూడు టీ20 మ్యాచ్‌లు కూడా జరుగుతాయి. ఈ పర్యటన ముగియగానే శ్రీలంక నేరుగా దుబాయ్‌కు రానుంది.బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా హసరంగ జట్టుకు దూరమయ్యాడు. అయితే, ఆసియా కప్ కోసం మాత్రం ఎంపికయ్యాడు. ఈ జట్టులో యువ బ్యాటర్లు కమిల్ మిశారా, నువనిడు ఫెర్నాండోలకు కూడా అవకాశం లభించింది. హసరంగతో పాటు దునిత్ వెల్లాలాగే, మహీష్ తీక్షణ కూడా స్పిన్ విభాగంలో ఎంపికయ్యారు. 2023లో శ్రీలంక వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ చేతిలో లంక ఘోర ఓటమిపాలయింది. ఈ సారి గ్రూప్ -బిలో అఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ జట్లతో కలిసి నిలిచింది.సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. అయితే శ్రీలంక మ్యాచ్‌లు మాత్రం సెప్టెంబర్ 13 నుంచి మొదలుకానున్నాయి. బంగ్లాదేశ్‌తో సెప్టెంబర్ 13న శ్రీలంక తన తొలి మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 15న హాంకాంగ్, సెప్టెంబర్ 18న అప్ఘనిస్థాన్‌తో తలపడనుంది. ఆసియా కప్ కోసం ప్రకటించిన శ్రీలంక జట్టు ఇదేచరిత్ అసలంక (కెప్టెన్), పాతూమ్ నిస్సంక, కుశాల్ మెండిస్ (వికెట్‌కీపర్), కుశాల్ పెరేరా (వికెట్‌కీపర్), నువనిడు ఫెర్నాండో, కమిందు మెండిస్, కమిల్ మిశారా, ధనుశ్ షానక, వనిందు హసరంగ, దునిత్ వెల్లాలాగే, చమిక కరుణారత్నే, మహీష్ తీక్షణ, దుష్మంత చమీరా, బినురా ఫెర్నాండో, నువన్ తుషారా, మతీషా పతిరానా.