అయ్ బాబోయ్ ఎంత పొడువో.. ఏడు కొండలపై ఏడు అడుగుల మహిళ.. రికార్డులు కూడా ఘనమే!

Wait 5 sec.

కలియుగ ప్రత్యక్ష దైవం సోమవారం ఓ ఏడు అడుగుల మహిళ సందడి చేసింది. సరిగ్గా చెప్పాలంటే ఆమె పొడవు ఏకంగా 6 అడుగులా 10 అంగుళాలు. రెండు ఇంచులు తక్కువ ఏడు అడుగులన్నమాట. సాధారణంగా మహిళలు ఆరడుగుల ఎత్తు ఉంటేనే.. ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి చూస్తారు. అలాంటిది ఆరడుగులా 10 అంగుళాల ఎత్తు అంటే.. వింతే కదా. తిరుమలలో ఈ మహిళను చూసిన భక్తులు అందరూ ఇలాగే ఆశ్చర్యపోయారు. ఆమె పేరు . శ్రీలంకకు చెందిన వ్యక్తి. వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తర్జిని వచ్చారు. క్యూలైన్‌లో ఆమెను చూసిన భక్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. దర్శనం తర్వాత ఆలయం బయట భక్తులు తర్జినిని వింతగా చూస్తూ ఉండిపోయారు. కొంత మంది భక్తులు ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు.*మరోవైపు వానమామలై పీఠాధిపతి మధుర కవి రామనుంజ జీయర్ స్వామి, ఆయన భక్త బృందంతో పాటు కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు తర్జిని శివలింగం. ఇక తర్జిని శివలింగం విషయానికి వస్తే.. తర్జిని నెట్ బాల్ క్రీడాకారిణి కూడా. గతంలో శ్రీలంక జాతీయ నెట్ బాల్ టీమ్‌కు కెప్టెన్‌గానూ వ్యవహరించారామె. పొడవైన నెట్ బాల్ ప్లేయర్లలో ఒకరిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీలంక తరుఫున అత్యధిక మ్యాచ్‌లు అడిన నెట్ బాల్ ప్లేయర్ కూడా తనే కావటం విశేషం. 2009లో శ్రీలంక జాతీయ నెట్ బాల్ టీమ్ తరుఫున అరంగేట్రం చేసిన ఆమె.. అప్పటి నుంచి రెగ్యులర్ మెంబర్‌గా మారిపోయారు.2011, 2015, 2019, 2023 సంవత్సరాల్లో జరిగిన INF నెట్‌బాల్ ప్రపంచ కప్‌లో తర్జిని శివలింగం శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించారు. ఇక 2019లో 40 ఏళ్ల వయసులో నెట్ బాల్ ప్రపంచకప్ ఆడిన తర్జిని శివలింగం.. నెట్ బాల్ ప్రపంచకప్ ఆడిన అతిపెద్ద వయస్కురాలిగా నిలిచారు. 2023లో మరోసారి ప్రపంచకప్‌లో పాల్గొని.. 44 ఏళ్లతో తన రికార్డును తనే మెరుగుపరుచుకున్నారు. భక్తుల కోసం టీటీడీ ఏర్పాట్లు మరోవైపు తిరుమలలోని వెంకటాద్రి నిలయంలో యాత్రికులకు వేడి నీటి సౌకర్యం కల్పించడం కోసం ఇందుకోసం సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. అలాగే వెంకటాద్రి నిలయంలోకి ప్రవేశానికి ముందు స్టెయిన్‌లెస్ స్టీల్ పాద రక్షల ర్యాక్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. భక్తులు పాదరక్షలను ఎక్కడపడితే అక్కడ వదులుతున్న నేపథ్యంలో స్టెయిల్ లెస్ స్టీల్ ర్యాకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే వెంకటాద్రి నిలయంలోకి పాద రక్షలతో రాకూడదని యాత్రికులకు పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ ద్వారా నిరంతర సూచనలు ఇవ్వాలని నిర్ణయించింది. యాత్రికుల భద్రత కోసం సిబ్బంది నియామకం సహా, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.