ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. హైదరాబాద్ వెళ్లే పని లేకుండా.. రూ.4,260 కోట్లతో!

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమైన గమనిక.. ఇకపై హైదరాబాద్ వెళ్లే పనిలేదు. అంతర్జాతీయ క్యాన్సర్‌ సెంటర్‌ ఏపీలోనే ప్రారంభంకానుంది. దక్షిణ కొరియాకు చెందిన వరల్డ్‌ స్మార్ట్‌ సిటీస్‌ ఫోరం ఛైర్మన్‌ పీటర్‌ చున్‌, ప్రకాశం జిల్లా దొనకొండలో సుమారు రూ.4,260 కోట్ల (480 మిలియన్‌ డాలర్ల) వ్యయంతో 25 ఎకరాల్లో ‘చున్‌ జియోంగ్‌ ఉన్‌ చల్లా క్యాన్సర్‌ సెంటర్‌’ను నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును వరల్డ్‌ స్మార్ట్‌ సిటీస్‌ ఫోరం, చల్లా గ్రూప్, ఒమెక్సా బయాలజీస్, మేస్, ఐ హోల్డింగ్‌ సంస్థలు సంయుక్తంగా చేపట్టనున్నాయి. విజయవాడలో జరిగిన సమావేశంలో ఈ సంస్థల ప్రతినిధులు ప్రపంచస్థాయి క్యాన్సర్‌ సెంటర్‌ నిర్మాణానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.ప్రపంచస్థాయి ప్రమాణాలతో క్యాన్సర్‌ సెంటర్‌ను నిర్మించడానికి అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. పీటర్ చున్, చల్లా గ్రూప్ అధినేత చల్లా ప్రసాద్ సూచనతో.. చెన్నైలో క్యాన్సర్ సెంటర్‌ను ప్రారంభించిన తర్వాత, తమ సేవలను ఆంధ్రప్రదేశ్‌కు విస్తరించాలని నిర్ణయించుకున్నారు. అనుమతులు రాగానే నిర్మాణ పనులు మొదలుపెడతామని తెలిపారు. ఈ స్మార్ట్ మెడికల్ సిటీ ప్రాజెక్టులో భాగంగా క్యాన్సర్ నిర్ధారణతో పాటుగా చికిత్స అందిస్తారు. అలాగే ఇక్కడ కంగా 1,500 పడకల ఆసుపత్రి, మెడికల్ స్కూల్, ఆరోగ్య సాంకేతిక కేంద్రం, క్యాన్సర్ మ్యూజియం, బొటానికల్ గార్డెన్, హెలిపోర్ట్, హోటల్, నివాస సముదాయాలు, పార్కులు వంటి అనేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా 4 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి చల్లా గ్రూప్ అధినేత చల్లా ప్రసాద్ సూచన కీలకమని పీటర్ చున్ అన్నారు. ప్రకాశం జిల్లా వాసిగా ఈ ప్రాంతంలో క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని చల్లా గ్రూప్ ఛైర్మన్ చల్లా ప్రసాద్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో మరికొన్ని ప్రాజెక్టులు ఏర్పాటు సిద్ధమన్నారు. పేదలకు మేలు చేసేలా అత్యాధునిక వైద్య సదుపాయాలతో క్యాన్సర్‌ సెంటర్‌ను నిర్మిస్తామన్నారు ఒమెక్సా కో ఫౌండర్‌ డాక్టర్‌ రాజన్‌ గార్గ్‌. 'ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించి ఉచితంగా ఆపరేషన్‌లు నిర్వహిస్తాం.. ఏపీతో పాటుగా తెలంగాణలోని పేదలకు ఈ క్యాన్సర్‌ సెంటర్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది' అన్నారు.ఈ క్యాన్సర్ అంతర్జాతీయ క్యాన్సర్‌ సెంటర్‌ అందుబాటులోకి వస్తే ఏపీ ప్రజలు హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడే క్యాన్సర్ చికిత్స తీసుకోవచ్చు. ఇప్పటికే ఏర్పాటు దిశగా అడుగులు పడ్డాయి. రెండు నెలల క్రితం ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన కూడా పూర్తి చేశారు. మొత్తం మీద క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏపీలోనే దొరికేలా అడుగులు పడుతున్నాయి.