తెలంగాణకు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. విదర్భ దానిని ఆనుకుని ఉన్న మరఠ్వాడ ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపారు. దీని ప్రభావం కారణంగా.. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా మంగళవారం రోజున కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే సూచనలు ఉన్నాయన్నారు. రాబోయే 48 గంటలు రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉండి.. కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.ఉపరితల గాలులు ఉత్తర దిశ నుంచి గంటకు 6 నుంచి 10 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉండగా.. వాతావరణ శాఖ మరో ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది: ఈ నెల 4వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా వెల్లడించింది. నేడు రాత్రి వేళల్లో తీవ్రమైన వర్షపాతం ముప్పు పొంచి ఉందన్నారు. యాదాద్రి - భువనగిరి, రంగారెడ్డి, జనగాం జిల్లాల నుంచి మొదలుపెట్టి హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి - కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల వరకు రాబోయే 4 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అదే విధంగా, కరీంనగర్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో రాత్రిపూట అక్కడక్కడ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.హైదరాబాద్ నగరంలో కూడా అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు పడవచ్చు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇక హైదరాబాద్ మహానగరంలో ఆదివారం రాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నగర జీవితాన్ని అస్తవ్యస్తం చేసింది. పటాన్‌చెరు, లింగంపల్లి, ఆర్‌సిపురం, కుత్బుల్లాపూర్, గాజులరామారం, నిజాంపేట్‌, శేర్లింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాలలో వాన బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో రహదారులపై వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.