ఏపీకి చెందిన గొప్ప మనసు చాటుకున్నారు. కేంద్ర ఆదాయపు పన్ను శాఖలో చీఫ్‌ కమిషనర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఆయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం. వెంకటరామయ్య పశ్చిమగోదావరి జిల్లా పాలేకోడేరు మండలం పెన్నాడ అగ్రహారంలో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో వేద పాఠశాల నిర్మాణానికి భారీ విరాళాన్ని అందజేశారు. ఈ బృహత్తర కార్యక్రమానికి భీమవరానికి చెందిన రాయసం వెంకటరామయ్య, జయలక్ష్మి భూమి, నగదు విరాళంగా అందించారు. కేంద్ర ఆదాయపు పన్ను శాఖలో చీఫ్ కమిషనర్‌గా పనిచేసి రిటైరైన వెంకటరామయ్య హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.ఈ వేద పాఠశాల నిర్మాణం కోసం రాయసం వెంకటరామయ్య, జయలక్ష్మి దంపతులు రూ.5 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. ఇందులో భాగంగా, పెన్నాడ అగ్రహారం రైల్వేస్టేషన్ సమీపంలో రూ.3 కోట్ల విలువైన రెండెకరాల భూమిని, అలాగే రూ.2 కోట్ల నగదును వారు అందించారు. ఈ వేద పాఠశాలకు సంబంధించిన మొత్తం ప్రాజెక్టును కంచి కామకోటి పీఠం నిర్వహిస్తోంది.. వెంకటరామయ్య వారికి అండగా నిలిచి భూరి విరాళం అందజేశారు. ఈ వేద పాఠశాల నిర్మాణం ద్వారా వేద విద్యను ప్రోత్సహించాలనేది పీఠం లక్ష్యం. రాయసం వెంకటరామయ్యను అందరూ అభినందిస్తున్నారు. రాయసం వెంకట్రామయ్య వారి తల్లితండ్రుల స్మృతిగా పురస్కారం అందిస్తున్నారు. రాయంస సుబ్బారాయుడు, రాయసం మహాలక్ష్మి పేరుతో కిన్నరె ఆర్ట్ థియటర్స్ & రాయం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్యానికి సంబంధించినవారికి పురస్కారాలు అందజేస్తున్నారు. ఈ ఏడాది ప్రముఖ సాహితీవేత్త తటవర్తి రాజగోపబాలంకు రాయసం సుబ్బారాయుడు పురస్కారం అందించారు. అలాగే రచయిత్రి, సాహితీ విమర్శకురాలు వాడ్రేవు వీరలక్ష్మిదేవికి రాయసం మహాలక్ష్మి పురస్కారం అందజేశారు. రాయసం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా వేద పాఠశాల నిర్మాణం కోసం పెద్ద మనసుతో భారీ విరాళాన్ని అందజేశారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు రాయసం వెంకటరామయ్య. హైదరాబాద్‌లో స్థిరపడిన ఆయన తన సొంత ప్రాంతంపై ప్రేమను మాత్రం వదల్లేదు. ఎన్నో కార్యక్రమాల ద్వారా, విరాళాల ద్వారా మంచి మనసును చాటుకుంటున్నారు.