ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌ని ఎవ్వరూ మరచిపోలేరు. ఆల్‌మోస్ట్ ఓడిపోయే స్టేజ్ నుంచి టీమిండియా వరల్డ్ కప్‌ని సొంతం చేసుకుంది. ఆ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఆఖరి ఓవర్ క్యాచ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. సరిగ్గా అలాంటి క్యాచ్చే లో కూడా రిపీట్ అయింది. లో బౌండరీ దగ్గర పట్టిన ఆ అద్భుత క్యాచ్ మహిళల జట్టుకు వరల్డ్‌కప్ తెచ్చి పెట్టింది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ అద్భుత ప్రదర్శనతో టీమిండియాపై ఒంటరి పోరాటం చేసింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన వోల్వార్ట్ 40 ఓవర్ల వరకూ క్రీజులో నిల్చొని సెంచరీ నమోదు చేసింది. 96 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించింది. ఫలితాన్ని నిర్ణయించే ఆఖరి పది ఓవర్లలో లారా తన బ్యాట్ పంజాని భారత బౌలర్లకు రుచి చూయించాలని అనుకుంది. మ్యాచ్ 42వ ఓవర్‌లో దీప్తి శర్మ మొదటి బంతి నుంచే బ్యాట్ జూలు విదిల్చాలని పెట్టుకుంది. దాంతో దీప్తి వేసిన మొదటి బంతిని గాల్లోకి బలంగా బాదింది. అందరూ సిక్స్ అనుకున్నప్పటికీ బంతి ఎక్కువ ఎత్తు లేవడంతో అది బౌండరీ లోపలే ఉండిపోయింది. దాంతో గాల్లోకి లేచిన బంతిని అందుకునేందుకు అమన్‌జోత్ కౌర్ ప్రయత్నించింది. కీలక సమయంలో కీలక క్యాచ్ రావడంతో అమన్‌జోత్ కూడా ఒక్కసారిగా టెన్షన్‌కు గురయింది. క్యాచ్ అందుకునే సమయంలో అది కాస్తా బౌన్స్ అయింది, కింద పడిపోతుంది అనుకునే సమయంలో మరోసారి ప్రయత్నించింది, మళ్లీ తప్పించుకుని ఇక చివరిసారి నేలపైకి తాకుతున్న సమయంలో అద్భుతంగా చేతిలోకి తీసుకుంది. ఆ క్యాచ్ మిస్సయ్యి ఉంటే ఫలితం మరోలా ఉండుండేది. అమన్‌జోత్ క్యాచ్ చూసిన ప్రతిఒక్కరూ ఆ రోజు సూర్యకుమార్ యాదవ్ క్యాచ్‌నే గుర్తు చేసుకున్నారు. ఆ రోజు సూర్య మిల్లర్ క్యాచ్‌ని వదిలేసినా.. ఈ రోజు అమన్ వోల్వార్ట్ క్యాచ్‌ని జారవిడిచినా ఫలితాలే తారుమారు అయ్యేయి. ఇప్పుడు అమన్‌జోత్ పట్టుకున్న ఆ అద్భుత క్యాచ్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వన్డే వరల్డ్ కప్‌నే అమన్‌జోత్ అందుకుంది అంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా భారత్‌కు బ్యాటింగ్‌ను ఇచ్చింది. షఫాలీ వర్మ - స్మృతి మంధాన తొలి వికెట్‌కు 104 పరుగుల భాగస్వా్మ్యం అందించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేయగలిగింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు 45.3 ఓవర్లలోనే 246 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ లారా వోల్వార్ట్ 101 పరుగులతో పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్న దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలవగా, షఫాలీ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకుంది.