: భారతీయ పారిశ్రామిక ప్రయాణంలో టాటా గ్రూప్ ఒక కీలక భాగస్వామి. టాటా గ్రూప్ కంపెనీలపై భారతీయులకు ఎనలేని నమ్మకం. వరకు టాటాల లెగసీ ఎలాంటి మచ్చ లేకుండా కొనసాగింది. అయితే ఆ పారిశ్రామికవేత్త మరణానంతరం టాటా గ్రూప్‌లో అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా సన్నిహితుల్లో ఒకరైన మెహ్లీ మిస్త్రీని లైఫ్ టైమ్ ట్రస్టీగా పునర్నియమించేందుకు టాటా ట్రస్ట్స్‌లో ఆమోదం లభించలేదు. దీంతో ఈ విషయంపై ఆయన న్యాయ పోరాటం మొదలు పెట్టారు.టాటా ట్రస్ట్స్ నిర్ణయాన్ని ముంబై ఛారిటీ కమిషనర్ ఎదుట సవాల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కేవియెట్ దాఖలు చేసినట్లు పలు జాతీయ మీడియాలు కథనాలు ప్రచురించాయి. టాటా ట్రస్ట్స్‌లోని ట్రస్టీల జాబితాలో చేసిన మార్పులు ఆమోదించేందుకు ముందే తన వాదనలు వినాలని మెహ్లీ మిస్త్రీ పిటిషన్‌లో కోరినట్లు సమాచారం. ట్రస్టీలు అందరికీ లైఫ్ టైమ్ నియామకం కల్పించాలని గత ఏడాది 2024 అక్టోబర్ నెలలో టాటా ట్రస్ట్స్ బోర్డు తీర్మానం ఆమోదించిన విషయాన్ని కమిషనర్ దృష్టికి ఆయన తీసుకెళ్లినట్లు సమాచారం. మహారాష్ట్ర పబ్లిక్ ట్రస్ట్స్ చట్టం ప్రకారం.. ఏదైనా ట్రస్టు తమ ట్రస్టీల లిస్టులో మార్పులు చేస్తే ఆ వివరాలను 90 రోజల లోపు కమిషనర్ ఆఫీసుకు తెలియ జేయాల్సి ఉంటుంది. అయితే, టాటా ట్రస్ట్స్ ఇంకా ఆ వివరాలు వెల్లడించలేదని సమాచారం. సర్ రతన్ టాటా ట్రస్ట్ (SRTT), సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ (SDTT), బాయి హీరాబాయి జంషెడ్జీ టాటా నవ్సారి ఛారిటబుల్ ఇన్‌స్టిట్యూషన్‌కుఈ ప్రతిపాదనను ట్రస్టీలయిన నోయల్ టాటా, వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్ వ్యతిరేకించినట్లు సమాచారం. ట్రస్టుల్లో మెజార్టీ దక్కకపోవడంతో మెహ్లీ మిస్త్రీ నియామకానికి ఆమోదం లభించలేదు. ఆ తర్వాత ఆయన న్యాయపోరాటానికి దిగారు. 2022లో టాటా ట్రస్ట్స్‌కు ట్రస్టీగా మెహ్లీ మిస్త్రీ నియమితులయ్యారు. మూడేళ్ల పదవీ కాలం 2025, అక్టోబర్ 28తో ముగిసింది. దీంతో పునర్నియామకంపై వివాదం కొనసాగుతోంది.