​హైదరాబాద్‌లో మరోసారి భూముల వేలం.. కోకాపేటలో అమ్మకానికి సిద్ధం.. ఎకరం రూ. 99 కోట్లు..!

Wait 5 sec.

హెచ్‌ఎండీఏ పరిధిలోని స్థలాల అమ్మకాలకు.. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో మరిన్ని స్థలాలను వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా కోకాపేట, కూకట్‌పల్లి ప్రాంతాల్లో సమాచారం. ఇంతకుమందు కోకాపేటలో భూముల వేలానికి అనూహ్య స్పందన వచ్చింది. ఎకరం రికార్డు స్థాయిలో ధర పలికిన విషయం తెలిసిందే. త్వరలో వేలం వేసే స్థలాలు ఎంత ధర పలుకుతాయి అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. హైదరాబాద్‌లో అత్యంత కీలకమైన ప్రాంతాలైన కోకాపేటలోని నియోపోలీస్, కూకట్‌పల్లి పరిధిలో ఉన్న మూసాపేట వై జంక్షన్ వద్ద భూముల అమ్మకానికి హెచ్ఎండీఏ ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం. ఈ రెండు ప్రాంతాల్లో మొత్తం 47 ఎకరాల భూమిని వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. కోకాపేట నియో పోలీస్‌లో 32 ఎకరాలు, కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద 15 ఎకరాల భూమి అమ్మకానికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఎకరం రూ. 99 కోట్లు..కోకాపేట నియోపోలీస్‌లో ఎకరా ప్రారంభ ధర రూ. 99 కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం. ఇక కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద ఎకరా ప్రారంభ ధర రూ. 75 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భూముల వేలం ద్వారా దాదాపు రూ. 4,000 కోట్లు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో జరిగే ఈ వేలం పాటను నవంబర్ 24, 28.. డిసెంబర్ 3, 5 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.కాగా, దీని ద్వారా రూ.3 వేల కోట్ల ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు 32 ఎకరాలు వేలం వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై హెచ్ఎండీఏ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. 2022లో కోకాపేట నియోపోలీస్‌లో జరిగిన వేలంలో ఎకరా రూ.100.75 కోట్లు పలికి రికార్డు సృష్టించింది. ఒకవేళ ఈసారి వేలం జరిగితే కూడా భారీ స్పందన ఉంటుందని అంచనాలు ఉన్నాయి. మరోవైపు, గత నెలలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన రాయదుర్గంలో.. తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీజీఐఐసీ) నిర్వహించిన వేలంలో ఇది రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించిన వేలాల్లోనే అత్యధిక ధర కావడం గమనార్హం.