దుమ్మురేపిన స్టాక్.. ఒక్కరోజే ఏకంగా రూ. 2300 పెరిగిన షేరు ధర.. ఇన్వెస్టర్లకు కాసుల పంట!

Wait 5 sec.

: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. దీనిపై ఏప్రిల్ 8న ఉదయం యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. సంచలన ప్రకటన చేశారు. కిందటి రోజేమో ఇరాన్‌ను నామరూపాల్లేకుండా చేస్తామని.. భీకర దాడులు చేస్తామని హెచ్చరించగా.. తెల్లారేసరికి వెనక్కి తగ్గారు. . హర్ముజ్ జలసంధిలో ఎలాంటి అంతరాయం లేకుండా చమురు సరఫరా కార్యకలాపాలు సజావుగా సాగాలని ట్రంప్ ఆదేశించారు. ఇరాన్ కూడా దీనికి ప్రస్తుతానికి సమ్మతించింది. సాయుధ దళాల పర్యవేక్షణలో కార్యకలాపాలు సాగుతాయని పేర్కొంది. దౌత్యపరంగా చర్చలు సాగుతాయని.. యుద్ధం పూర్తి స్థాయిలో ఆగిపోలేదని వెల్లడించింది. ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత భారత స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డు స్థాయిలో పుంజుకున్నాయి. వరుసగా ఐదో సెషన్‌లో కూడా లాభాల్ని నమోదు చేశాయి. ఏప్రిల్ 8న సెన్సెక్స్ 2946 పాయింట్లు పెరిగి 77,563 వద్ద స్థిరడింది. . నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ చూస్తే 873 పాయింట్లు లేదా 3.78 శాతం ఎగబాకి 23,997 వద్ద సెషన్ ముగించింది. మదుపరుల సంపదగా పరిగణించే.. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఒక్కరోజులోనే రూ. 16 లక్షల కోట్లకుపైగా పెరిగింది. అయితే ఇక్కడే ఒక మల్టీనేషనల్ ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరర్ ఫోర్స్ మోటార్స్ అదరగొట్టింది. ఈ స్టాక్ బుధవారం సెషన్‌లో భారీగా పెరిగింది. కిందటి రోజు ఈ స్టాక్ ధర రూ. 19,920 వద్ద ముగియగా.. ఇవాళ నేరుగా దాదాపు రూ. 1000 మేర పెరిగి రూ. 20,900 వద్ద ఓపెన్ అయింది. అంతటితో ఆగకుండా ఇంట్రాడేలో దాదాపు 12 శాతం పెరిగింది. దీంతో ఒక్కో షేరుపై సుమారు రూ. 2350 కు పైగా పెరగడంతో రూ. 22,290 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 11.10 శాతం లాభంతో రూ. 22,131 వద్ద స్థిరపడింది. ఇక్కడ ఒక్కో షేరుపైనే రూ. 2,211 పెరిగింది. దీంతో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి కాసుల పంట పండింది.స్టాక్ మార్కెట్లో సానుకూలతలు సహా కంపెనీ పెర్ఫామెన్స్.. ఇన్వెస్టర్లను ఆకర్షించింది. ఫోర్స్‌మోటార్స్ గత ఆర్థిక సంవత్సరంలో (2025-26) దేశీయంగా ఏకంగా 36536 యూనిట్లను విక్రయించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే కార్ల సేల్స్ 20 శాతం పెరిగాయి. దీంతో ఇన్వెస్టర్లలో జోష్ నెలకొంది. సెంటిమెంట్ బలపడింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 26,450 కాగా.. కనిష్ఠ ధర రూ. 8300 గా ఉంది. సంస్థ మార్కెట్ విలువ రూ. 29.10 వేల కోట్లుగా ఉంది.గమనిక: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌కు లోబడి ఉంటాయి. పైన ఇచ్చింది సమాచారమే.. పెట్టుబడికి సిఫార్సు కాదు.. వీటిల్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల నుంచి సలహాలు తీసుకోవడం మంచిది.