ఐపీఎల్ 2026లో డామినేటింగ్ పర్ఫార్మెన్స్ చేస్తోంది. ఐపీఎల్ 2025లో నాలుగంటే నాలుగు మ్యాచ్‌లు గెలిచి తొమ్మిదో స్థానంలో సీజన్‌ను ముగించిన రాజస్థాన్.. ఈ ఏడాది కూడా అదే ఆటతీరు కనబరుస్తుంది అనుకున్నారు. దానికి తోడు సంజూ శాంసన్ బయటకు రావడం, జోస్ బట్లర్ వంటి సీనియర్లను వదిలేయడంతో ఇక రాజస్థాన్ పని అయిపోయిందని అనుకున్నారు. కానీ.. యంగ్ టాలెంట్ బ్యాటింగ్ పూల్‌తో గోడకు కొట్టిన బంతిలా రాజస్థాన్ రాయల్స్ ఈ ఏడాది అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మూడింటిలోనూ విజయం సాధించింది. అందులో రెండు మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగగా, మరో మ్యాచ్‌లో ఒత్తిడిని జయించి మరీ ఆఖరి ఓవర్లలో బౌలింగ్‌తో నెగ్గింది. రియాన్ పరాగ్ కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్ చరిత్ర సృష్టించేందుకు తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది. ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఆరు పాయింట్లు నెట్ రన్ రేట్ +2.403తో టాప్ ప్లేస్‌ను అందుకుంది. అనుభవం లేని కెప్టెన్సీ, హిట్టింగ్‌నే నమ్ముకున్న ఓపెనర్లు.. ఎక్స్‌పయిరీ డేట్‌గా దగ్గరగా ఉన్న బౌలర్లు అని ఎంత మంది అన్నప్పటికీ.. అందరికీ తమ ఆటతోనే రాజస్థాన్ రాయల్స్ సమాధానం చెప్పింది. కేవలం పాయింట్ల పట్టికలోనే కాకుండా ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్‌లలోనూ రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లే టాప్‌లో నిలవడం విశేషం. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌కు అందించే ఆరెంజ్ క్యాప్‌ను యశస్వి జైస్వాల్ సొంతం చేసుకోగా.. ఎక్కువ వికెట్లు పడగొట్టిన పర్పుల్ క్యాప్‌ను రవి బిష్ణోయ్ అందుకున్నాడు. ఈ సీజన్‌లో యశస్వి జైస్వాల్ ఆడిన మూడు మ్యాచ్‌లలో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు బాది 170 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు సమీర్ రిజ్వి 2 మ్యాచ్‌లలో 160 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇక బౌలింగ్ విషయంలో రాజస్థాన్ రాయల్స్ కీలక స్పిన్నర్ రవి బిష్ణోయ్ మూడు మ్యాచ్‌లలో తొమ్మిది ఓవర్లు బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టాడు. అందులో గుజరాత్‌పై తీసిన నాలుగు వికెట్లు హైలెట్ అని చెప్పొచ్చు. రవి బిష్ణోయ్ తర్వాత రెండో స్థానంలో కూడా రాజస్థాన్ రాయల్స్ పేసర్ బర్గర్ ఉన్నాడు. బర్గర్ ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఇలా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్.. పాయింట్స్ టేబుల్ అన్నింటిలోనూ రాజస్థాన్ రాయల్స్ టాప్ ప్లేస్‌లో ఉండి డామినేటింగ్ ప్రదర్శన చేస్తోంది.