టాలీవుడ్ స్టార్ హీరోలైన , రామ్ చరణ్.. RRR సినిమాతో గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తమకు వచ్చిన గుర్తింపుతో ఇద్దరూ స్టార్ ట్యాగ్స్ కూడా మార్చుకున్నారు. 'మ్యాన్ ఆఫ్ మాసెస్' అని తారక్.. 'గ్లోబల్ స్టార్' అని చెర్రీ పేర్లు పెట్టుకున్నారు. 'గేమ్ ఛేంజర్' ప్లాప్ తర్వాత చరణ్ మళ్లీ తన పేరుని 'మెగా పవర్ స్టార్' అని మార్చుకున్నారు. ఆ సంగతి అటుంచితే, ఇప్పుడు రామ్ చరణ్ ఓ ప్రముఖ మ్యాగజైన్ కవర్‌ పేజీపై మెరిశారు. రామ్ చరణ్ ఫోటోను ‘ఎస్క్వైర్ ఇండియా’ మ్యాగజైన్ కవర్‌ పేజీపై ముద్రించారు. ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్న చెర్రీ.. ఆ మధ్య దుబాయ్ వెళ్లి మ్యాగజైన్ కోసం ఫొటో షూట్‌ను నిర్వహించారు. ఆ ఫోటోలనే ఇప్పుడు ఎస్క్వైర్ ఇండియా ఏప్రిల్‌ ఎడిషన్‌లో పబ్లిష్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో చెర్రీతో పాటుగా ఆయన పెట్ డాగ్ రైమ్ కూడా ఉంది. అభిమానులు ఈ పిక్స్ ని లైక్ చేసి షేర్ చేస్తుండటంతో, క్షణాల్లోనే నెట్టింట వైరల్‌గా మారాయి. ''గ్లోబల్ ఫోర్స్ గా ఎదుగుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేటి ఇండియన్ సినిమాకు ఒక నిర్వచనంలా నిలుస్తున్నారు. కానీ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఒక నిశ్శబ్దమైన కథ ఉంది. అది క్రమశిక్షణ, సహజ ప్రవృత్తి, అచంచలమైన ఆత్మవిశ్వాసంపై నిర్మించబడింది. ఇన్నేళ్ల తన అద్భుతమైన కెరీర్‌లో చరణ్ ఎప్పుడూ అంచనాలను అందుకోవడానికి ప్రయత్నించ లేదు... వాటిని మెరుగుపరుస్తున్నారు. నటన కన్నా తన ఉనికిని, కేవలం ఆర్భాటం కన్నా అర్థాన్ని ఎంచుకుంటున్నారు. ఆయన మునుపెన్నడూ చూడని కొత్త రూపంలోకి అడుగుపెట్టిన మా లేటెస్ట్ కవర్‌ పేజీతో, మేము ఆయన ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము'' అని ఎస్క్వైర్ ఇండియా పోస్ట్ పెట్టింది. తన ఉనికిని చాటుకోవాల్సిన అవసరం ఎన్నడూ లేకుండా జీవించే ఒక స్టార్ రామ్ చరణ్ అని పేర్కొంది. 2025 ఆగస్టు ఎడిషన్ లో ఎస్క్వైర్ ఇండియా’ మ్యాగజైన్ కవర్‌ పేజీపై ఎన్టీఆర్‌ ఫోటోను ముద్రించారు. తద్వారా ఈ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై మెరిసిన తొలి హీరోగా తారక్ రికార్డు సృష్టించారు. ఆయన తర్వాత ఇప్పుడు రెండో హీరోగా రామ్ చరణ్‌ నిలిచారు. RRR హీరోలిద్దరూ ఇలా పాపులర్ మ్యాగజైన్ లో కనిపించడాన్ని అభిమానులు ప్రత్యేకంగా భావిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జిమ్ లో దిగిన ఓ ఫోటోని తారక్ షేర్ చేయగా.. నెట్టింట వైరల్ హెగా మారింది. మరోవైపు బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పుడు ఓ స్పెషల్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు.