తిరుపతి జిల్లా రైల్వేకోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌‌పై ఆరోపణలు చేసిన మహిళకు హైకోర్టులో ఊరట దక్కింది. ఎమ్మెల్యే మహిళపై తల్లి చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఆమెకు హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు అందుబాటులో ఉండాలని.. సాక్షుల్ని బెదిరించడం, ప్రభావితం చేయకూడదని కోర్టు షరతుల్లో పేర్కొంది. కోర్టు అనుమతి తీసుకోకుండా జిల్లా దాటి వెళ్లకూడదని.. పాస్‌పోర్టు కోర్టులో అప్పగించాలని ఆదేశించింది.. పాస్‌పోర్టు లేకపోతే అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. ఒక వారంలో మెజిస్ట్రేట్ ముందు హాజరై రూ.20 వేలతో రెండు పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. పోలీసులు ఈ కేసులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసేవరకు సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో ముందు ప్రతి శనివారం హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. పాస్‌పోర్ట్‌ను కోర్టులో అప్పగించాలి. పాస్‌పోర్ట్‌ లేకుంటే ఆమేరకు అఫిడవిట్‌ వేయాలని సూచించింది. ఒకవేళ ఆమె షరతుల్ని ఉల్లంఘిస్తే పోలీసులు బెయిల్ రద్దుకు చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ఆరోపణలు చేసిన మహిళపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. మహిళ తన కుమారుడు, కుటుంబసభ్యులతో పరిచయం పెంచుకున్నారన్నారు. ఏకంగా రూ.25 కోట్లు డిమాండ్ చేసిందని.. ఆమె తన కుమారుడ్ని బెదిరించారని, కుట్ర చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తానని బెదిరించినట్లు ఆరోపించారు. ఈ మేరకు రైల్వే కోడూరు పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.జనసేన పార్టీ రైల్వేకోడూరు ఎమ్మెల్యే లైంగిక దాడి, మోసం చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె అరవ శ్రీధర్‌తో ప్రైవేట్‌గా మాట్లాడినట్లుగా కొన్ని వీడియోలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తనకు న్యాయం చేయాలంటూ ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు జనసే పార్టీ ఈ ఆరోపణలపై విచారణ చేసేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ శ్రీధర్‌ను ప్రశ్నించింది. బాధితురాలు చేసిన ఆరోపణలు, వాట్సాప్‌ చాటింగ్‌ వ్యవహారంపై ఆరా తీశారు. తనపై వచ్చిన ఆరోపణలకు జనసేన పార్టీ ఏర్పాటు చేసిన కమిటీకి వివరణ ఇచ్చానన్నారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. తమ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే కట్టుబడి ఉంటానని.. అలాగే తనపై నమోదైన కేసులను చట్టపరంగానే ఎందుర్కొంటానని శ్రీధర్ చెబుతున్నారు.