టీటీడీ ఛైర్మన్‌కు కోర్టులో ఊరట.. 'సత్యం చివరకు గెలుస్తుంది' అంటూ బీఆర్ నాయుడు ట్వీట్

Wait 5 sec.

టీటీడీ ఛైర్మన్ దక్కింది. తనపై కొందరు విషప్రచారం చేస్తున్నారని.. వెంటనే ఆ ప్రచారాన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. 'టీటీడీ ఛైర్మన్‌గా నాపై జరుగుతున్న విషప్రచారంపై గౌరవనీయ హైదరాబాద్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ చేయడం జరిగింది. నాపై ఆధారరహిత, దుష్ప్రచార కథనాలను ఇకపై ప్రసారం లేదా ప్రచారం చేయకూడదని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ప్రచురితమైన కథనాలను తక్షణమే తొలగించాలని కూడా పేర్కొంది' అన్నారు. 'అలాగే గూగుల్, ట్విట్టర్ (X), ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లకు సంబంధిత కంటెంట్‌ను డౌన్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తిరుమల ప్రతిష్టను దెబ్బతీయాలనే కుట్రలో భాగంగా, ఏఐ మరియు మార్ఫింగ్ వీడియోల ద్వారా నాపై దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయి. సత్యం చివరకు గెలుస్తుంది. ధర్మం వైపు నిలబడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు' అంటూ ట్వీట్ చేశారు.కొంతమంది సోషల్ మీడియాలో నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ నాయడు అంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేలా.. తనను వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేసేందుకు ఇలా ప్రచారం చేస్తున్నారు అన్నారు. ఏఐ సాంకేతికతతో తన రూపం అనుకరించే విధంగా వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.'ఈ కంటెంట్ మొత్తం అసత్యమైనది, వక్రీకరించినది.. ఇది టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పన్నిన పథకం. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉంది. వైసీపీ కి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. దీనిపై నేను చట్ట ప్రకారం ముందుకెళ్తాను.. నాపై సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్ర ను తేల్చాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులను, దుష్ట శక్తులను వదిలేది లేదు' అంటూ స్పందించారు. ఆ వెంటనే కోర్టును ఆశ్రయించగా.. ఊరట దక్కింది.